Samantha-Chaitanya : విడాకులతో విడిపోయినా సమంత, నాగచైతన్యల వ్యవహారం రోజూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే సాగుతోంది. విడాకుల అనంతరం సమంత తన మాజీ భర్తపైన ఎమోషన్ కామెంట్స్ చేసింది. వారి బంధం గురించి ఫైర్ అయ్యింది. ఓ షోలో ఏకంగా మా ఇద్దరూ ఒక గదిలో ఉంటే అక్కడ కత్తులు ఏమీ ఉండకుండా చూసుకోవాలి అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సామ్ చైతో తన బంధం ఎలా ఉండేదో చెప్పేసింది. దీంతో విరిద్దరి విడాకులకు కారణమేంటో ఫ్యాన్స్ కు ఓ రంగా అర్థమయ్యింది. అనంతరం సమంత అనారోగ్యంతో పోరాడుతోందని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోందని , ఈ భామ హిట్ కోసం ఎన్నో పీట్లు చేస్తుందని రోజుకో వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. సామ్ చైను మరిచిపోలేదని, అందుకే టాటూలను భద్రంగా ఉంచుకుందని వర్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. మరోవైపు నాగచైతన్య , యువ నటి శోభితతో రిలేషన్ లో ఉన్నాడని, డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తోందని రోజూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే సమంత నటించిన శాకుంతలం సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. శాకుంతలం ఇంతలా ఫ్లాప్ అవ్వడానికి నాగ చైతన్యనే కారణమని సమంత సామ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే సామంత మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ బాంబు పేల్చింది. సమంత చేసిన ఓ షేర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. త్వరలో నాగ చైతన్య సినిమా విడుదల అవుతున్న నేపథ్యలో తాను గేమ్ స్టార్ట్ చేసినట్లుగా ఈ పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.
మే 12 న నాగ చైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇదే క్రమంలో తాజాగా చైతూ ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు..ఇంటర్వ్యూలో చై మాట్లాడుతూ… ‘‘నా జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి బాధలు లేవు..ఏ విషయంలోనూ బాధపడలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన నాకు ఓ గుణపాఠాన్ని నేర్పించింది.కొన్ని సినిమా లతో ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను” అని చై తెలిపాడు. ఇదే సందర్భంలో.. సమంత తన ఇన్స్టా వేదికగా ‘టార్చర్ టైమ్’ అంటూ ఓ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి వార్ మొదలైందని నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
సమంత తన ఇన్స్టాలో ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అంటూ.. ఐస్ ముక్కలు ఉన్న టబ్లో ఉన్న పిక్ ను షేర్ చేసింది. అయితే ఇది తన వ్యాధి నివారణకు చేసిందా లేదా ‘సిటాడెల్’ కోసం చేసిందా అనేది తెలియదు. ఇదే షేర్ లో సామ్ ‘యాక్షన్ మోడ్ ఆన్’ అంటూ రెండు బాంబ్ ఎమోజీలను కూడా జత చేసింది. దీనితో ఇది ఖచ్చితంగా చైతూని టార్గెట్ చేసిందని చైతూ ఫ్యాన్స్ అంటున్నారు. మరి సామ్ ఎవరికి పంచులు ఇవ్వబోతోందో చూడాల్సిందే.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.