Sai Pallavi : ఫిదా సినిమాతో హైబ్రిడ్ పిల్లగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది మలయాళీ బ్యూటీ సాయి పల్లవి. ఇక్కడ అమ్మాయి కాకపోయినా తెలంగాణ యాసలో మాట్లాడి అందరిని ఫిదా చేసింది. తన డాన్స్ మూవ్స్ తో ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తుంది. మొదటి సినిమా తోనే మైండ్ బ్లాక్ చేసిన సాయి పల్లవికి వరుస ఆఫర్లు వచ్చాయి. సహజ సిద్ధమైన లుక్స్ తో కనిపిస్తూ సహజ నటిగా పేరు సంపాదించుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్డమ్ ను సంపాదించుకుంది. గారికి విరాటపర్వం వంటి సినిమాల్లోనూ వితౌట్ మేకప్ నటించి తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది.
ఇప్పటివరకు చాలా వరకు టీవీ షోలో తన లైఫ్ జర్నీకి సంబంధించి అనేక విషయాలను పంచుకుంది సాయి పల్లవి. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం నటి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే మీటూ విషయానికి సంబంధించి స్పందించింది సాయి పల్లవి. ఏదో టచ్ చేస్తాను లేదా అసభ్యకరంగా బిహేవ్ చేస్తేనో కాదు మాటలతో కూడా ఏ మాత్రం ఇబ్బంది కలిగించేలా చేసినా కూడా అది వేధింపులతో సమానమేనని సాయి పల్లవి తెలిపింది. సింగర్ స్మిత ఈమధ్య చేస్తున్న నిజం విత్ స్మిత అనే ప్రోగ్రాం కి సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మీ టూ ఉద్యమానికి సంబంధించి చేసిన కామెంట్స్ సంబంధించిన ప్రోమో కట్ అయింది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కేవలం మీతో మాత్రమే కాకుండా సాయి పల్లవి తన కెరీర్లో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను స్మితతో తెలిపింది. తాను ఎదిగే క్రమంలో వచ్చిన అనేక సవాళ్లను ఎలా అధిగమించిందో తెలిపింది. యాంకర్ స్మిత మరో చమత్కారమైన క్వశ్చన్ అడిగింది దానికి అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చింది సాయి పల్లవి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేయాలనీ ఉంది అని అడిగితే ఈ ముగ్గురూ కలిసి తనతో ఓ పాట చేస్తే బాగుంటుందని చెప్పింది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.