Categories: LatestNews

Political: రాజధానుల కోసం రాజీనామా… రక్తికట్టించే పనిలో వైసీపీ డ్రామా..!

Political: ఏపీలో మూడు రాజధానులు అంటూ వైసీపీ. ఒకే రాజధాని అది అమరావతి మాత్రమే అంటూ మిగిలిన విపక్షాలు హడావిడి చేస్తూ రాజకీయం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న ఎన్నికలకి ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలని వారు సిద్ధం చేసుకొని ప్రజలలోకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అయితే మళ్ళీ తమని సంక్షేమ పథకాలు అధికారంలోకి తీసుకువస్తామని భావిస్తున్నారు.

అలాగే మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాంతో ప్రాంతీయ ఎమోషన్ ని టచ్ చేస్తూ ఉన్న వ్యతిరేకతని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అమరావతి రాజధానిగా ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే అజెండాతో మిగిలిన పార్టీలు తమ రాజకీయ వ్యూహాలని అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి.

మరో వైపు ఈ సారి తమ అధికార బలం ఉపయోగించుకొని అవసరం అయితే ప్రజలని భయపెట్టి, బెదిరించి విపక్షాల పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ వారిని ప్రజలకి దూరం చేయాలనే ఆలోచనతో వైసీపీ ఉన్నట్లు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది. అమరావతి రైతుల పాదయాత్రకి అడుగడుగున వైసీపీ నేతలు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన, జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు.

తమ నాయకులపై దాడి జరిగిందని చూపిస్తూ అస్సలు గొడవతో సంబంధం లేని వారిని అధికార బలంగా అరెస్ట్ చేశారు. ఇక వైసీపీ నేతలు కూడా ఇష్టారీతిలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎదురుదాడి చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి కాస్తా ఆవేశంగా మాట్లాడేసరికి ఇప్పుడు మహిళ కమిషన్ తో నోటీసులు ఇప్పించారు.

ఇదిలా ఉంటే ఎలా అయిన మూడు రాజధానుల అంశమే అజెండాగా ప్రజల్లోకి వెళ్లి ప్రాంతీయ ఎమోషన్స్ ని తమకి అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ అధిష్టానం చేస్తుంది. ఇక దీనికోసం విశాఖని పరిపాలనా రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో రాజీనామాల రాజకీయం మొదలు పెట్టారు. కొద్ది రోజుల క్రితం కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖని పరిపాలనా రాజధాని చేయాలని దానికోసమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే అది స్పీకర్ ఫార్మాట్ లో లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజీనామా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ వారించడంతో అతను వెనక్కి తగ్గారనే విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎన్నికలకి ఆరు నెలల ముందు ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలతో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేయించి పరిపాలనా రాజధాని కోసమే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలకి చెప్పాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

ఇలా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని, రాజధాని కావాలనే ఫీలింగ్ ని వారిలో పెంచి ప్రాంతీయ ఎమోషన్స్ ని అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలని కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ కోసం రాజీనామా చేయించి అక్కడ అదే ప్రచారాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు.

ఆ విధంగా ఎన్నికలకి మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధి అనే అజెండాతో ప్రజలలోకి వెళ్లాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలా తమకున్న వ్యతిరేకత ఓటుని తగ్గించుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని కూడా తగ్గించొచ్చు అని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Bandi Bhagirath: బండి సంజయ్ కుమారుడి కేసులో ట్విస్ట్‌.. ఊరంతా అవే పోస్టర్లు!

Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…

8 hours ago

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…

10 hours ago

Petrol Price News: ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…

1 day ago

CM Revanth Reddy: కేంద్రంతో క‌లుస్తాం.. కానీ, అందుకు మాత్రం కాదు!

CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

1 day ago

Narendra Modi: గోల్డ్‌ కొనకండి.. మోదీ పిలుపు వెనుక అర్థ‌మేంటి..?

Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…

2 days ago

Roja Selvamani: USలో తొలి ఇండియ‌న్‌గా అన్షు క్రేజీ రికార్డ్‌.. ఏడ్చేసిన రోజా!

Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…

2 days ago

This website uses cookies.