Health: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడతారు. ఒక్కోసారి ఈ వ్యాధులు ప్రమాదకరంగా మారి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మారుతున్న కాలంతో పాటు వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలలో కాలుష్యం ఎక్కువైపోయింది. నీటి కాలుష్యం కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అనే సంగతి తెలిసిందే. మురుగునీరు, చెత్త వ్యర్ధాలు ఎక్కువగా పెరిగిపోయిన ప్రాంతాలలో ఈ దోమలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి పరిసరాలలో నివసించే వారు దోమల కాటుతో వ్యాధుల బారిన పడతారు.
ఇదిలా ఉంటే దోమలు మనుషుల్లో అందరి మీద దాడి చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిశోధకులు దోమలు దాడి చేస్తున్న మనుషులపై పరిశోధనలు చేసి ఎక్కువగా అవి ఎవరిని ఎటాక్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. చర్మంపై కార్బాక్సిలిక్ యాసిడ్ లు ఎక్కువగా ఉన్నవారిని దోమలు లక్ష్యంగా చేసుకుంటాయన నిర్ధారించారు. అలాంటి వారిపట్ల దోమలు వేగంగా ఆకర్షితం అవుతాయని, వారే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ బారిన పడతారని తెలియజేసారు.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.