Renu Desai : సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ అప్డేట్స్ , సోషల్ మెసేజ్ లను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో పంచుకుంటుంది. మరీ ముఖ్యంగా తన కూతురు ఆద్య, కొడుకు అకీరాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సంతోషంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇక గత రెండు మూడు రోజులుగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా కనిపించింది. ఎందుకంటే తన పిల్లలిద్దరూ దేశ ప్రధాని మోదీని కలవడం ఆమెకు ఎంతో సంతోషాన్ని అందించిందని ఆమె వరుసగా పోస్టులు చేసింది.తాజాగా సోషల్ మీడియాలో తన కూతురు గురించి ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ నెంట్టింట్లో వైరల్ అవుతోంది.
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ పాలిటిక్స్ లో గెలిచినప్పటి నుంచి కొడుకు అకీరా నిత్యం తన తండ్రి వెంటే ఉంటున్నాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు అకీరా వెళ్తున్నాడు. పవన్ కూడా తన కొడుకును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే పవర్ ఢిల్లీ టూర్ లో భాగంగా తన భార్య అన్నాతో పాటు అకీరాను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఢిల్లీలో పవన్ ప్రధాని నకేంద్ర మోదీకి అకీరాను పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రేణూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను బీజేపీ వ్యక్తినని.. తన కుమారుడు మోదీని కలవడం సంతోషంగా ఉందంటూ రేణూ కామెంట్స్ చేసింది. అయితే ఆ సమయంలో కూతురు ఆద్య నాన్నతో కలిసి ఢిల్లీకి వెళ్లలేకపోయింది.
కానీ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆద్య తళుక్కుమంది. అన్నయ్య అకీరా, మెగా ఫ్యామిలీతో కలిసి ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధానీ మోదీకి తన చెల్లెల్ని దగ్గరుండి పరిచయం చేశాడు అన్న అకీరా. ఆ పిక్స్ ను రేణూ సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది రేణూదేశాయ్. ” స్కూల్ స్టార్ట్ కావడం వల్ల అకీరాతో కలిసి ఆద్య ఢిల్లీకి వెళ్లలేకపోయింది. కానీ మోదీని కలవాలనే ఆమె కోరిక ఎట్టకేలకు నెరవేరింది. నిన్న పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అకీరా , ఆద్యను మోదీకి పరిచయం చేశాడు. నా టీనేజ్ నుంచి నేను బీజేపీ అభిమానిని. తన తండ్రి ద్వారా నా పిల్లలు మేదీని కలవడం ఒక తల్లిగా చాలా ఆనందంగా ఉంది” అంటూ భావోద్వేగమైంది.
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
This website uses cookies.