Tue. Feb 10th, 2026

    Renu Desai: పవర్ పవర్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ని పవర్ స్టార్ ఫాలోవర్స్ అందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు. హీరోయిన్ గా ఆమె నటించింది రెండే తెలుగు సినిమాలు మాత్రమే. అవి కూడా పవన్ కళ్యాణ్ కి జోడీగానే నటించింది. భద్రి, జాని సినిమాలలో ఆమె నటించింది. పవర్ స్టార్, రేణు దేశాయ్ కి అఖిరా నందన్, ఆధ్యా అని ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్నా కూడా తరువాత మరల సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. అలాగే బుల్లితెరపై రియాలిటీ షోలలో కూడా రేణు దేశాయ్ సందడి చేస్తూ వస్తుంది. మరల కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న ఈమె తాజాగా పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయింది.

    Pawan Kalyan's ex-wife Renu Desai reveals she is 'searching for soulmate'  on Instagram | News9live

    తన భావాలను భావోద్వేగాలను కవిత్వం రూపంలో ప్రజెంట్ చేసింది. మండుటెండలో ఇలా చల్లని మేఘాల మన జీవితంలోకి కొందరు అనుకోకుండా వస్తారు. చూపుల్లోనే మన మనసుల్లో గుచ్చేస్తూ ఉంటారు. మాట్లాడుతుంటారు. అదొక అంతు చిక్కని మూగ భాషల కొన్ని గంటలే వారు గడపొచ్చు. కానీ వారి ముద్ర, వారి ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది. అయితే అందులోని చాలా ప్రయాణాలు బాధతో ఉండవచ్చు. కానీ కొంతమంది మన జీవితాలను పరిపూర్ణం చేస్తారు.

     

    మన కన్నీళ్లను చూసి మన జీవితంలో మరింత కాంతిని పంచుతారు. నవ్విస్తారు అంటూ రేణు దేశాయ్ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అయితే రేణు దేశాయ్ పెట్టిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆకాశంలో మేఘావృతం అయిన దృశ్యాలు వీడియో పెట్టి దానికి ఈ కవిత్వాన్ని జోడించడం చూస్తుంటే ఈ పోస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే చాలా ఏళ్ళ తర్వాత రేణు దేశాయ్ మరల టైగర్ నాగేశ్వరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెకి ఈ మూవీ రీఎంట్రీ కావడం విశేషం.