Rashmika Mandanna : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది . మార్ఫింగ్ వీడియోలను ఇలా పోస్ట్ చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్యగా కేంద్రం అభివర్ణించింది. ఇలాంటి వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియాలదేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అడ్వైజరీ జారీచేసింది.
కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ..” ఐ టీ యాక్ట్ 2000, సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి పర్సనల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రూ.లక్ష వరకు ఫైన్ కూడా విధిస్తారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చట్టాన్ని అనుసరించి వ్యవహరించాలి. యూజర్లు ఫేక్ ఇన్ఫర్మేషన్ పోస్టు చేయకుండా చూడాలి. ఒకవేళ ఫేక్ వీడియో పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా డిలీట్ చేయాలి. రూల్స్ పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అని మినిస్టర్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీ రష్మికకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. డీప్ నెక్ తో ఉన్న టీ షర్ట్ లో రష్మిక ఎక్స్పోజింగ్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం పెద్ద సెన్సేషన్ గా మారింది. కొంతమంది ఆకతాయిలు రష్మిక ను ట్రోల్ చేసేందుకు చేసిన వీడియో ఇది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్మిక ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు.
ఈ విషయంపై ఇప్పటికే నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా రష్మికను సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దీనిపై లీగల్ కేసు నమోదు చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని చూస్తుంటే ఫ్యూచర్ పై భయం వేస్తోందని తాజాగా అక్కినేని నాగచైతన్య ఈ వీడియోపై స్పందించాడు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రష్మిక మందన్నా కృతజ్ఞతలు తెలిపింది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…
Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
This website uses cookies.