Rashmika Mandanna : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది . మార్ఫింగ్ వీడియోలను ఇలా పోస్ట్ చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్యగా కేంద్రం అభివర్ణించింది. ఇలాంటి వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియాలదేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అడ్వైజరీ జారీచేసింది.
కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ..” ఐ టీ యాక్ట్ 2000, సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి పర్సనల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రూ.లక్ష వరకు ఫైన్ కూడా విధిస్తారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చట్టాన్ని అనుసరించి వ్యవహరించాలి. యూజర్లు ఫేక్ ఇన్ఫర్మేషన్ పోస్టు చేయకుండా చూడాలి. ఒకవేళ ఫేక్ వీడియో పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా డిలీట్ చేయాలి. రూల్స్ పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అని మినిస్టర్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీ రష్మికకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. డీప్ నెక్ తో ఉన్న టీ షర్ట్ లో రష్మిక ఎక్స్పోజింగ్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం పెద్ద సెన్సేషన్ గా మారింది. కొంతమంది ఆకతాయిలు రష్మిక ను ట్రోల్ చేసేందుకు చేసిన వీడియో ఇది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్మిక ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు.
ఈ విషయంపై ఇప్పటికే నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా రష్మికను సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దీనిపై లీగల్ కేసు నమోదు చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని చూస్తుంటే ఫ్యూచర్ పై భయం వేస్తోందని తాజాగా అక్కినేని నాగచైతన్య ఈ వీడియోపై స్పందించాడు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రష్మిక మందన్నా కృతజ్ఞతలు తెలిపింది.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.