Rashmika Mandanna: టాలీవుడ్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల తన కొత్త వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిన్న, మొన్న ఊదరగొట్టినట్లుగానే చివరకు తన కొత్త వెంచర్ను అధికారికంగా ప్రకటించింది. ‘డియర్ డైరీ’ అనే పేరుతో ఓ ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ లైనప్ను లాంఛ్ చేసింది. ఇది సాదాసీదా బ్రాండ్ కాదని, తన జీవితంలో scent (పరిమళం) ఎంత ముఖ్యమో చెబుతూ.. ఇది తన వ్యక్తిత్వంలో ఓ భాగమని చెప్పుకొచ్చింది రష్మిక.
“పరిమళం నా జీవితం లో ఓ భాగం. ఇప్పుడు అదే పరిమళాన్ని మీ అందరితో పంచుకోవడం నన్ను చాలా ఉత్సాహపరుస్తోంది, అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది. ఈ ప్రయాణంలో మీరు అందరూ నాకు ఆశీస్సులు ఇవ్వాలి,” అంటూ ఎంతో భావోద్వేగంతో తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ను ప్రస్థావించింది.
ఈ లాంఛనానికి సెలబ్రిటీలు, అభిమానులు మంచి స్పందన ఇచ్చారు. విజయ్ దేవరకొండ వంటి వ్యక్తులు కూడా ఆమెకు బలంగా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ ఆన్లైన్ అమ్మకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వేదికగా ఎంపికైన ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉండగా, ఒక్కో బాటిల్ గరిష్ట ధర రూ.2599 గా ఉంది.
ఇక త్వరలోనే ఫిజికల్ ఔట్లెట్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రష్మిక ఈ వ్యాపారంతో తన అభిరుచిని, వ్యక్తిత్వాన్ని, ఎమోషనల్ కనెక్ట్ను ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటోంది. ఫ్యాషన్, లైఫ్స్టైల్లోనే కాదు ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ సెక్టార్లోనూ రష్మిక తన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…
This website uses cookies.