Rashmika Mandanna: టాలీవుడ్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల తన కొత్త వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిన్న, మొన్న ఊదరగొట్టినట్లుగానే చివరకు తన కొత్త వెంచర్ను అధికారికంగా ప్రకటించింది. ‘డియర్ డైరీ’ అనే పేరుతో ఓ ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ లైనప్ను లాంఛ్ చేసింది. ఇది సాదాసీదా బ్రాండ్ కాదని, తన జీవితంలో scent (పరిమళం) ఎంత ముఖ్యమో చెబుతూ.. ఇది తన వ్యక్తిత్వంలో ఓ భాగమని చెప్పుకొచ్చింది రష్మిక.
“పరిమళం నా జీవితం లో ఓ భాగం. ఇప్పుడు అదే పరిమళాన్ని మీ అందరితో పంచుకోవడం నన్ను చాలా ఉత్సాహపరుస్తోంది, అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది. ఈ ప్రయాణంలో మీరు అందరూ నాకు ఆశీస్సులు ఇవ్వాలి,” అంటూ ఎంతో భావోద్వేగంతో తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ను ప్రస్థావించింది.
ఈ లాంఛనానికి సెలబ్రిటీలు, అభిమానులు మంచి స్పందన ఇచ్చారు. విజయ్ దేవరకొండ వంటి వ్యక్తులు కూడా ఆమెకు బలంగా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ ఆన్లైన్ అమ్మకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వేదికగా ఎంపికైన ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉండగా, ఒక్కో బాటిల్ గరిష్ట ధర రూ.2599 గా ఉంది.
ఇక త్వరలోనే ఫిజికల్ ఔట్లెట్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రష్మిక ఈ వ్యాపారంతో తన అభిరుచిని, వ్యక్తిత్వాన్ని, ఎమోషనల్ కనెక్ట్ను ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటోంది. ఫ్యాషన్, లైఫ్స్టైల్లోనే కాదు ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ సెక్టార్లోనూ రష్మిక తన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.