Ramajogaiahsastry: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కి కాపీ క్యాట్ అనే పేరున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ట్యూన్స్ కాపీ కొడతారనే మాట వినిపిస్తూనే ఉంది. ప్రతీ సినిమాలో ఏదో ఒక పాట విషయంలో సోషల్ మీడియా సాక్షిగా చాలా రాద్ధాంతం జరుగుతోంది. అయినా, థమన్ వీటిని పట్టించుకోవడం లేదు. దీనికి కారణం మన స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఆయనని ఎంకరేజ్ చేస్తూ వరుసగా సినిమాలిస్తున్నారు కాబట్టి.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతుంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా హారిక అండ్ హాసిని పతాకంపై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా ఓవైపున సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండవ పాటగా ‘ఓ మై బేబీ’ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటకి ‘సరస్వతీపుత్ర’ రాంజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శిల్పారావు పాడారు. అయితే, ఈ పాట ‘అలవైకుంఠపురములో’ సినిమాలో ట్యూన్ మాదిరిగా ఉందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో దీనికి గురించి తెగ చర్చ సాగుతోంది. కొందరు తిడుతూ కామెంట్స్ చేశారు.
ఈ ట్రోల్స్పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పందించారు. ‘ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే. అభిప్రాయం చెప్పే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని. మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. అదే లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేము గొప్పగా చేయలేం. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి’.. అంటూ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కానీ, ఇంకా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ స్పందించకపోవడం ఆశ్చర్యకరం.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.