Politics: రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. అయితే ఈసారి పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వినిపించిన ఒక వాయిస్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సరికొత్త చర్చకు తెరలేపింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆమె నేరుగా జగన్ను సమర్థించకపోయినా, అమరావతి విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కానీ, పార్టీలోని సీనియర్లలో మాత్రం ఇది సరికొత్త టెన్షన్కు దారితీస్తోంది.
గతంలో తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్రావు ఏపీ రాజకీయాలపై స్పందించిన తీరును వైసీపీ నేతలు ఇంకా మర్చిపోలేదు. ఒకప్పుడు జగన్తో సఖ్యతగా ఉంటూనే, సమయం చూసి ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. ఇక కేంద్రం ఇచ్చే నాలుగు వేల కోట్ల అప్పు కోసం జగన్ సర్కార్ రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడుతోందంటూ హరీష్రావు చేసిన విమర్శలు వైసీపీని తీవ్రంగా ఇరుకున పెట్టాయి. మిత్రులు అనుకున్నవారే అలా ఊహించని షాక్ ఇవ్వడంతో, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీలోని ఒక వర్గం పూర్తిగా నమ్మలేకపోతోంది.
ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించాలని కొందరు వైసీపీ నేతలు ఉత్సాహపడుతున్నారు. ఇది తమకు దొరికిన పొలిటికల్ బూస్ట్ అని భావిస్తున్నారు. అయితే, పార్టీలోని మరికొందరు పెద్దల వాదన మరోలా ఉంది. ఇప్పుడు కవిత మాటలకు పొంగిపోతే.. రేపు పొద్దున మళ్లీ వారే తిరగబడితే సమాధానం చెప్పుకోలేం అన్నది వైసీపీ అంతర్గత వర్గాల్లో నడుస్తున్న టాక్. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్ర నేతల మద్దతు ఎప్పుడూ తాత్కాలికమేనని, వారిని నమ్ముకుని ఏపీలో రాజకీయం చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, కవిత ఇచ్చిన ఈ సపోర్ట్ వైసీపీలో ఆనందం కంటే.. మున్ముందు ఎలాంటి ముప్పు తెస్తుందోనన్న టెన్షన్ను ఎక్కువగా పెంచుతోంది.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.