ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి అధికార పార్టీ తమపై నిఘా పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నిస్తున్నామని కక్ష పెంచుకొని అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వేధిస్తున్నారని అన్నారు. తాను తన ఫ్రెండ్ తో మాట్లాడిన మాటల గురించి ఇంటలిజెన్స్ చీఫ్ అడగడంతోనే తనకి సందేహం వచ్చిందని, ఇక ఆరోగ్య రక్ష కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ పెట్టినపుడు ఇంటలిజెన్స్ అధికారులు వచ్చి తనని ప్రశ్నించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు.
అయితే వీరిద్దరూ మంత్రి పదవులు రాకపోవడంతో అప్పటి నుంచి అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇలా బురదజల్లుతున్నారు అంటూ వైసీపీ నేతలు, ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లిపోతామని అనుకుంటే తమకి ఎలాంటి అభ్యంతరం లేదని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వానికి ఎవరి ఫోన్ లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అయితే తాజాగా కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 35 మంది ఎమ్మెల్యే, 5 మంది మంత్రులు తనకి ఫోన్ చేసి మాట్లాడారని, వారి ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు వాపోయారని బాంబు పేల్చాడు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఈ ఫోన్ ట్యాపింగ్ అగ్గి రాజుకున్నట్లు అయ్యింది. అనుమానించే చోట తాను అవమానాలు భరిస్తూ ఉండలేనని, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేయను అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యే ల దారిలో ఇంకెంత మంది వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
This website uses cookies.