Payal Ghosh: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఆత్మహత్యల ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. గతంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో ప్రయాణం హీరోయిన్ గా నటించిన పాయల్ ఘోష్ అందరికి పరిచయం ఉండే ఉంటుంది. ఆ తరువాత ఊసరవెల్లి సినిమాలో ఆమె తమన్నాకి ఫ్రెండ్ రోల్ లో నటించింది. ఆ తరువాత తెలుగులో ఎలాంటి సినిమా చేయలేదు. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆమె బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సెన్సేషన్ అయ్యింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద ఆమె లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టింది. వాటిపై అతను కూడా రియాక్ట్ అయ్యారు. ఆ ఘటన 2020లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత మరల ఈమె సోషల్ మీడియాలో సూసైడ్ లెటర్ పోస్ట్ చేసి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ సూసైడ్ లెటర్ లో పాయల్ ఘోష్ తన చావుకి వారే కారణం అంటూ రాసుకొచ్చింది. నేను పాయల్ ఘోష్. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకున్నా, గుండెపోటుతో చనిపోయిన దానికి వారే కారణం అవుతారు అంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొంది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందించి.
ప్రస్తుతం మీరు బాగానే ఉన్నారు కదా అని ఆమె భాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేసింది. తునీషా శర్మ ఆత్మహత్య తనని దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు మనుషులు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకి ఎలా వస్తారో అనే డౌట్ వస్తుంది. అయితే మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటికి నిర్లక్ష్యం చేయకూడదు మాత్రం అర్ధం అవుతుంది. ప్రజలు కూడా దీనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆత్మహత్య అనేది సమస్యలకి పరిష్కారం కాదు. మనల్ని మనం నమ్మడం జీవితం అనే పరుగు పందెంలో ముందుకి వెళ్ళగలం అని పాయల్ ఘోష్ పోస్ట్ లో పేర్కొంది.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.