Pawan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజాక్షేత్రంలో ముందుకు వెళుతున్నారు. అయితే తెలుగుదేశం వైసీపీకి ప్రత్యామ్నాయం అనే స్థాయికి ఇంకా ఎదగలేకపోయారు. బలమైన ప్రభావమైతే చూపించగలుగుతున్నారు కానీ 2024 ఎన్నికలలో దానిని ఎంతవరకు ఓటు బ్యాంకుగా మలుచుకోగలరు అనేది ఇప్పుడు చర్చనీయాంసంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా ఉభయగోదావరి జిల్లాలను ఎంపిక చేసుకుని జూన్ 14 నుంచి 10 నియోజకవర్గాలలో వారాహి యాత్ర చేయబోతున్నారు.
ఇక ఈ యాత్ర ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సాగనుంది. మొత్తం స్థానిక సమస్యలపై ఫోకస్ చేయడంతో పాటు అన్ని వర్గాల వారీతో మాట్లాడుతూ ఈ యాత్రని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారని నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి పవన్ వారాహి యాత్ర మొదలు పెట్టడం వెనుక బలమైన వ్యూహమే ఉందని తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ నియోజకవర్గాలలో అయితే యాత్ర చేయబోతున్నాడో ఆ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు లెక్క. ఈ యాత్ర ద్వారా టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితమైన క్లారిటీ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
మొదటి దశలో భాగంగా పది నియోజకవర్గాలని పవన్ కళ్యాణ్ ఎంచుకొని యాత్ర చేయబోతున్నారు. ఇక వీటిలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ఉంటుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ యాత్ర ప్రభావం ఎలా ఉండబోతోంది అనేదానిపై పవన్ కళ్యాణ్ కూడా తన వ్యూహం మార్చుకునే అవకాశం ఉంది. అలాగే ఈ యాత్రలో చాలా మంది బలమైన నాయకులు జనసేనలోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.