Version 1.0.0
Pawan Kalyan : రెండు నెలలుగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. ఏపీలో టీడీపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 10 ఏళ్లుగా విజయం కోసం పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రికార్డుస్థాయి మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 70వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే సాబ్ అయ్యారు.
మొదటిసారిగా అధికారిక లాంఛనాలతో త్వరలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కోసం సేవ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన 21మంది జనసేన అభ్యర్థులు కూడా ఘన విజయాన్ని సాధించారు. రెండు ఎంపీ స్థానాలను కూడా జనసేన గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో పవన్ విక్టరీతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను భావోద్వేగానికి లోనయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వపన్ రాజకీయాల్లోనూ తన దూకుడుతో విక్టరీ సాధించడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందలను తెలియజేశారు. అన్నయ్య చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ చెల్లెల్లు మెగా ఫ్యామిలీ మొత్తం సంబురాల్లో మునిగిపోయింది.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి కూడా పవన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. ఓ వీడియోను నెట్టింట్లో విడుదల చేసి తన కొడుకు విజయం గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. అంజనా దేవి మాట్లాడుతూ..”ఈ రోజు మా అబ్బాయి రాజకీయాల్లో విక్టరీ సాధించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి ఆ దేవుడు మంచి ఫలితం ఇచ్చాడు. ఇక ఇవాళ్టి నుంచి నేను కూడా ప్రతి రోజు ఈ గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను” అని అంజనా దేవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్, మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.నెటిజన్స్ ఈ వీడియో చూసి అంజనమ్మకు కామెంట్లు చేస్తున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.