Pawan Kalyan – Sai Dharam Tej : ఘనంగా మెగా మల్టీస్టారర్ ప్రారంభం అయింది. తమిళంలో నటుడు, దర్శకుడు సముద్రఖని రూపొందించిన సూపర్ హిట్ మూవీ వినోదాయ చిత్తం. ఓటీటీలో విడుదలై అద్బుతమైన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తెలుగు రీమేక్ పనులు మొదలుపెట్టారు. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై రక రకాల రూమర్స్ వచ్చాయి.
ఆ రూమర్స్కి చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఆయన మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్తో కలిసి ఈ కొత్త చిత్రాన్ని పవన్ నేడు పట్టాలెక్కించారు. తమిళ వెర్షన్ను రూపొందించిన సముద్రఖని తెలుగు రీమేక్ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎప్పటినుంచో మెగా మల్టీస్టారర్ కోసం మెగా అభిమానులే కాదు, అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి కోరిక ఇప్పుడు నెరవెవరబోతోంది.
ఇక తాజాగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. చిత్రీకరణలో పాల్గొన్న పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ మీద మామా అల్లుళ్ళు చేసే సందడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహకందడం లేదు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
మరో వైపు సాయి ధరమ్ తేజ్ కూడా సెలెక్టెడ్గా చిత్రాలను చేస్తూ తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూన్నాడు. మరి ఈ మెగా మల్టీస్టారర్తో మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను నమోదు చేస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన హాట్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తోంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.