Categories: LatestNewsPolitics

Pawan Kalyan: బీఆర్ఎస్ తో పొత్తుకి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారా?

Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో వచ్చే ఎన్నికల లక్ష్యంగా చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలం రాజకీయ ప్రయాణంలో ఇప్పటివరకు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న నాయకుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీలతో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు. ఆ సమయంలో బిఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరై వారితో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బంధంలోనే కొనసాగుతున్నారు. 

2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైసీపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు  సిద్ధంగా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీ రాజకీయాలలో తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ కాస్త అగ్రిసివ్ మోడ్ లో ఏపీలో వెళ్తుంది. కొద్దిరోజుల క్రితం మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీకి కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు హరీష్ రావుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వీడియో రిలీజ్ చేసి వైసీపీ మంత్రులు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారు అంటూ విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రజలకు బేషారతుగా వైసీపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఈ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారంటూ విమర్శించడం విశేషం. కొత్త పొత్తులకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెరతీస్తున్నారని అందుకే బీఆర్ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.

గతంలో తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదే రకమైన ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 1000 కోట్ల ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి ఆశ చూపించింది అంటూ ఒక న్యూస్ ప్రచారం చేసింది. దానిపై జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు హరీష్ రావు కూడా తెలంగాణ ప్రజలను అవమానించారని వైసీపీ పై వ్యాఖ్యలు చేయలేదు.  కానీ పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కొత్త పల్లవి అందుకోవడం ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

3 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

1 day ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

1 day ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

2 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

2 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

This website uses cookies.