AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఓ వైపు టీడీపీ, జనసేన ఓ వైపు అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. అలాగే ఈ కూటమితోనే బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ నాయకులని ఒప్పిస్తానని అంటున్నారు. తన దగ్గర కచ్చితమైన లెక్కలు బీజేపీని ఒప్పించేందుకు ఉన్నాయని చెబుతున్నారు. ఇక జనసేనని ఒంటరి పోరు వైపు మళ్లిస్తే సునాయాసంగా గెలవచ్చు అని వైసీపీ వ్యూహాలు వేసుకుంది. ఆ దిశగానే తన క్యాడర్ తో పొత్తుల బంధంపై దుష్ప్రచారం చేయడం ద్వారా జనసైనికుల నుంచి వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. అయితే ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చేశారు. పొత్తులతో వచ్చే ఎన్నికలలో వెళ్తామని చెప్పేశారు.
అయితే తమ గౌరవానికి భంగం కలగకుండా సీట్లు విషయంలో డిమాండ్ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. తమకి పర్టిక్యులర్ గా కొన్ని ప్రాంతాలలో బలం ఉందని, అక్కడ ఓటు శాతం ఎక్కువ ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే జనసేనాని లెక్క ప్రకారం 30 నుంచి 40 స్థానాలలో కచ్చితంగా గెలిచే సత్తా ఉందని క్లారిటీ ఇచ్చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని వైసీపీ నేతలు చాలెంజ్ చేసిన కూడా కచ్చితంగా తాను పోటీ చేయబోయేది ఎన్ని స్థానాలు అనేది కూడా చెప్పేశారు. ఇక టీడీపీతో వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో పొత్తుల ద్వారానే ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధం అవుతోంది.
దీని ద్వారా నిజానికి రాయలసీమ జిల్లాలలో టీడీపీకి కూడా గట్టి పట్టు లేదని చెప్పాలి. పొత్తుల నేపథ్యంలో వైసీపీని వ్యతిరేకించే వారు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా చూసుకుంటే టీడీపీ లెక్క 120 నుంచి 140 స్థానాల వరకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బలం ఉంది. వైసీపీ అయితే 175 నియోజకవర్గాలలో గెలవాలని వ్యూహాలు వేసుకుంటుంది. అయితే ఇప్పుడు జనసేనాని టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే కనీసం 120 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉండేది.
అయితే ఈ పొత్తుతో వారి బలం గణనీయంగా తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 80 నుంచి 100 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. అయితే కూడా ప్రభుత్వానికి సానుకూలత ఉంటే మాత్రమే. ఇక బీజేపీ టీడీపీ, జనసేన కలిస్తే ఓ ఐదు నుంచి 6 స్థానాలలో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2024లో ఏపీ రాజకీయ ముఖచిత్రం కచ్చితంగా మారుతుందని అందరూ భావిస్తున్నారు. గతంలో ఏదో ఒక పార్టీ లీడింగ్ లోకి రావడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
This website uses cookies.