packaged-food-creates-huge-damage-to-body
Health: ఆధునిక యుగంలో ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానాలలో చాల మార్పులు వచ్చాయి. ప్రజల అవసారాలని దృష్టిలో ఉంచుకొని వ్యాపారవేత్తలు నిల్వ ఉన్న ఆహారాలని ప్యాకేజ్ చేస్తూ అందిస్తున్నారు. పల్లెటూళ్ళలో స్వచ్చమైన ఆహారం అప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. అయితే సిటీ కల్చర్ పెరిగిపోవడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు బ్రతుకు తెరువు కోసం సిటీకి వలసలు పోతున్నారు. దీంతో సిటీలో ఉండే ప్రజల అవసారాలకి సరిపడా ఆహార పదార్ధాలు మామూలుగా దొరకడం లేదు. దీంతో ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీలు ప్రజల అవసరాలని, వారి ఆహారపు అలవాట్లని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ ఆహారాన్ని ప్యాకింగ్ చేసి వాటిని అవి నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయినాలని ఉపయోగిస్తూ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.
అయితే వీటిని డైట్ అండ్ ప్రోటీన్ ఫుడ్ గా ప్రచారం చేస్తున్నారు. అలాగే హెల్డీ ఫుడ్ అంటూ ప్రమోషన్ చేస్తున్నారు. చివరికి సహజసిద్ధంగా లభించి కొబ్బరి నీళ్ళు కూడా ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచి అమ్మేస్తున్నారు. అలాగే టీ పొడి నుంచి చికెన్ వరకు అన్నింటిని కూడా ప్యాకేజ్ ఫుడ్ గా మార్చేసి సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని ఉపయోగించవచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రజలు కూడా ఈ ప్యాకేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఫుడ్స్ ప్రొడక్ట్స్ చాలా ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకేజ్ చేసి నిల్వ ఉంచి ఆహార పదార్ధాలని తరుచుగా తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి అండాశయ, బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మన రోజువారి ఆహారంలో 10 శాతం అల్ట్రా ప్యాకెజ్డ్ ఫుడ్ వాడడం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 2% పెరుగుతుందని పేర్కొంటున్నారు. అదే అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 19% ఉంటుందని చెబుతున్నారు.
ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడం వలన క్యాన్సర్ మాత్రమె కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. టైప్ -2 డయాబెటిస్ కూడా ప్యాకేజ్ ఫుడ్ కారణంగా వస్తుందని తెలుస్తుంది. పిల్లల్లో అధిక బరువు సమస్య వస్తుందని చెబుతున్నారు. ప్యాకేజ్ ఫుడ్ వినియోగం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.