Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున తాజాగా “ఆరోజు బీరు తాగి, బిర్యాని తిన్నా..అప్పుడే ఆ ఆలోచన వచ్చింది..అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాగార్జున ఎందుకు ఇలా మాట్లాడారు..అసలు విషయం ఎంటో కథనంలోకి వెళ్ళి తెలుసుకుందాం. కెరీర్ ప్రారంభంలో నాగార్జునకి సరైన హిట్స్ లేవు. ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని హిట్స్ అందుకుంటూ వచ్చారు.
శివ నాగార్జున కెరీర్లో ఎప్పటికీ ఓ మైల్ స్టోన్లా మిగిలిపోయే సినిమా. ఆ తర్వాత నాగార్జున వరుసగా మంచి హిట్స్ అందుకున్నారు. కమర్షియల్ హీరోగా కెరీర్ ఊపులో ఉండగానే ఎవరూ ఊహించని విధంగా అన్నమయ్య సినిమా చేయడం. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున ఎన్నో నెగిటివ్ కామెంట్స్ విన్నారు. అయినా రాఘవేంద్ర రావు మీద నమ్మకంతో అన్నమయ్య చేసి కెరీర్లో మళ్ళీ ఇలాంటి సినిమా చేయలేరేమో అనే మంచి కామెంట్స్ అందుకున్నారు.
అన్నమయ్యగా నాగార్జున చేసిన పర్ఫార్మెన్స్ మహాద్భుతం. ఆ తర్వాత శిరిడి సాయి సినిమా చేశారు. అయితే, ఈ సినిమా చేయాలనే ఆలోచన మాత్రం ముందు వచ్చింది నాగార్జునకేనట. సోమవారం నుంచి శనివారం వరకూ నాగార్జున తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అన్నీ లిమిట్గా తీసుకుంటారు. ఒక్క ఆదివారం మాత్రం నాగార్జునని ఎవరూ ఆపలేరు. ఆ ఒక్కరోజు మాత్రం ఆయనకి నచ్చిన తిండి నచ్చినంత తింటారు. అలాగే ఒక ఆదివారం బిర్యానీ తిని ఫుల్లుగా బీరు తాగి ఉన్నారట.
ఆ సమయంలో నాగార్జునకి శిరిడి సాయిబాబా పాత్రలో నటించాలనే ఆలోచన కలిగిందట. అదే మాట దర్శకుడు రాఘవేంద్ర రావుకి చెప్తే ఆయన కూడా సరే అని చెప్పారట. ఆ తర్వాత నాగార్జున శిరిడీకి వెళ్ళి సాయిబాబాని దర్శించుకొని రావడం, శిరిడి సాయి సినిమా చేయడం జరిగాయని నాగార్జున చెప్పారు. ఈ భక్తి ప్రధానమైన చిత్రం చేయడానికి అసలు నాగార్జున ఏ సమయంలో డిసైడయ్యారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరచారు.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.