Categories: LatestNewsPolitics

MLC Elections: క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ

MLC Elections: ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు వేడి మొదలైంది. ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలలో స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి గాను మొత్తం15 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 13న ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి వైసీపీ, టీడీపీ బలంగా పోటీ పడుతున్నాయి. అయితే అధికార పార్టీ వైసీపీ ఈ ఎన్నికలలో కూడా తిరిగి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ సీట్లు పోటీ లేకుండానే ఏకగ్రీవం చేసుకున్నాయి. మిగిలిన స్థానాలలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని అధికార పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది.

 

ఇందుకు గాను ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలకి ఇన్ చార్జ్ లని నియమించి స్థానిక సంస్థల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కచ్చితంగా అధికార పార్టీ గెలుపుకి పనిచేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ అభ్యర్ధులని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపధ్యంలో కచ్చితంగా అన్ని స్థానాలలో గెలుస్తామని జగన్ ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఎప్పటిలాగే నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ ఏకగ్రీవం చేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.

 

అయితే నామినేషన్లు వేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు అనేది వైసీపీ నేతల మాట. ఓడిపోతామని తెలిసి ఎవరూ నామినేషన్లు వేయడానికి ముందుకి రావడం లేదని వారి వాదన. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడం ద్వారా స్థానిక సంస్థల నాయకులలో వ్యతిరేకత ఉందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వైసీపీ సిద్ధం అవుతుంది. మరో వైపు ఉత్తరాంద్రలో అన్ని స్థానాలలో గెలిచి విశాఖ రాజధాని అనే అంశాన్ని బలపరచాలని భావిస్తున్నారు.

Varalakshmi

Recent Posts

TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలా..ఈ చిన్న పని చేస్తే చాలు?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…

19 hours ago

Mangoes: రాత్రిపూట మామిడిపండు తిని పడుకుంటున్నారా? ఈ ఇబ్బందులు మీ వెంటే?

Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…

2 days ago

Tirumala Tirupati: ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. శ్రీవారి దర్శన గడువు పెంపు..

Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…

2 days ago

TDP PARTY: టీడీపీలో రాజ్యసభ మంటలు.. మొద‌లైన బుజ్జ‌గింపులు..!

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…

2 days ago

Politics: మోదీకి 7 రోజులే టైమ్.. కొత్త పార్టీ అల్టిమేటం!

Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…

2 days ago

AP POLITICS: ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. లీకైన హాట్ లిస్ట్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…

2 days ago

This website uses cookies.