Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రానున్న ఎన్నికలే లక్ష్యంగా వారాహి వెహికల్ తో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక తన యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన బస్సుని సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ బస్సుని వారం రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక బస్సు ఫోటోలు షేర్ చేసి వారాహి యుద్ధానికి సిద్ధం అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్, నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికి తెలిసిందే. ఇక వైసీపీ విమర్శలపై జనసేనాని కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. అయితే తాజాగా వైసీపీ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ వారు అందరూ షాక్ అయ్యే వార్త బయటకి వచ్చింది.
15 రోజుల క్రితమే వారాహి వాహనానికి హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీవో కమిషనర్ తాజాగా మీడియాకి క్లారిటీ ఇచ్చారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కి వచ్చినపుడు అది పవన్ కళ్యాణ్ వెహికల్ అనే విషయం తెలియదని చెప్పారు. ఇక వాహనం నిబంధనలకి అనుగుణంగా ఉందని, రంగు విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. ఆర్మీ వాహనాలకి ఉపయోగించే రంగుకి వారాహి రంగుకి వ్యత్యాసం ఉందని చెప్పారు. అలాగే అన్ని నిబంధనలకి లోబడి ఉండటంతో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని, నెంబర్ కూడా కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, ఏపీలో ఆర్టీఐ నిబంధనలకి లోబడి ఉంటేనే వారాహి ఇక్కడ రహదారులపై తిరుగుతుందని మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. దీని ద్వారా కచ్చితంగా ఏపీలోఆర్టీఐ నిబంధనలు అంటూ ఏదో ఒక రకంగా ఆరంభంలోనే బస్సు యాత్రకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
బస్సు యాత్ర ప్రారంభమైన యాత్ర మధ్యలో ఏదో ఒక కారణం చూపించి అడ్డుకునే ప్రయత్నం కూడా జరగొచ్చని కూడా వైసీపీ నాయకుల మాటల బట్టి అర్ధం అవుతుంది. ఏపీలో టీడీపీ, జనసేనకి యాత్రలు చేసే అవకాశం ఇవ్వమని, కచ్చితంగా అడ్డుకుంటామని సోషల్ మీడియాలో, అలాగే నాయకులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దీనిని బట్టి ఏపీలో పవన్ కళ్యాణ్ ని వీలైనన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం ద్వారా జనసేనని టీడీపీకి దూరం చేసి ఒంటరిగా పోటీ చేసేలా చేయాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.