Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రానున్న ఎన్నికలే లక్ష్యంగా వారాహి వెహికల్ తో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక తన యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన బస్సుని సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ బస్సుని వారం రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక బస్సు ఫోటోలు షేర్ చేసి వారాహి యుద్ధానికి సిద్ధం అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్, నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికి తెలిసిందే. ఇక వైసీపీ విమర్శలపై జనసేనాని కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. అయితే తాజాగా వైసీపీ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ వారు అందరూ షాక్ అయ్యే వార్త బయటకి వచ్చింది.
15 రోజుల క్రితమే వారాహి వాహనానికి హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీవో కమిషనర్ తాజాగా మీడియాకి క్లారిటీ ఇచ్చారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కి వచ్చినపుడు అది పవన్ కళ్యాణ్ వెహికల్ అనే విషయం తెలియదని చెప్పారు. ఇక వాహనం నిబంధనలకి అనుగుణంగా ఉందని, రంగు విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. ఆర్మీ వాహనాలకి ఉపయోగించే రంగుకి వారాహి రంగుకి వ్యత్యాసం ఉందని చెప్పారు. అలాగే అన్ని నిబంధనలకి లోబడి ఉండటంతో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని, నెంబర్ కూడా కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, ఏపీలో ఆర్టీఐ నిబంధనలకి లోబడి ఉంటేనే వారాహి ఇక్కడ రహదారులపై తిరుగుతుందని మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. దీని ద్వారా కచ్చితంగా ఏపీలోఆర్టీఐ నిబంధనలు అంటూ ఏదో ఒక రకంగా ఆరంభంలోనే బస్సు యాత్రకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
బస్సు యాత్ర ప్రారంభమైన యాత్ర మధ్యలో ఏదో ఒక కారణం చూపించి అడ్డుకునే ప్రయత్నం కూడా జరగొచ్చని కూడా వైసీపీ నాయకుల మాటల బట్టి అర్ధం అవుతుంది. ఏపీలో టీడీపీ, జనసేనకి యాత్రలు చేసే అవకాశం ఇవ్వమని, కచ్చితంగా అడ్డుకుంటామని సోషల్ మీడియాలో, అలాగే నాయకులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దీనిని బట్టి ఏపీలో పవన్ కళ్యాణ్ ని వీలైనన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం ద్వారా జనసేనని టీడీపీకి దూరం చేసి ఒంటరిగా పోటీ చేసేలా చేయాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.