Politics: సిక్కోలు నుంచి మొదలు పెట్టబోతున్న జనసేనాని… ఈ విషయంలో ఎన్టీఆర్ ని ఫాలో అవుతూ..

Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలా అయిన రాజకీయంగా తన ప్రభావాన్ని విస్తృతం చేసుకోవాలని, అవకాశం ఉంటే అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని నిలువరించేందుకు వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. వాటికి దీటుగానే జనసేనాని రాజకేయ కార్యాచరణ సిద్ధం చేసుకొని రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతున్నాడు. ఓ వైపు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నా కూడా రాజకీయంగా వీలైనంత వరకు యాక్టివ్ గా ఉంటూ ప్రజలకి తనపై నమ్మకం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం వైఫల్యాల మీద ఫోకస్ చేస్తున్నాడు. కౌలు రైతులకి లక్షరూపాయిల పరిహారం అనేది పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ ని బాగా పెంచింది. అదే సమయంలో జనవాణి కార్యక్రామానికి కూడా మంచి స్పందన వచ్చింది.

ఇక ఇప్పటం లో ఇళ్ళ కూల్చివేత ఘటన కూడా పవన్ కళ్యాణ్ కి కొంత మైలేజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు యువశక్తి అనే కార్యక్రామానికి జనసేనాని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా యువతని లక్ష్యంగా చేసుకొని నిరుద్యోగం, స్కాలర్ షిప్పులు తొలగించడం వంటి అంశాలని ప్రధానంగా ఎంచుకోవడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడంలో వైసీపీ సర్కార్ విఫలం అయ్యిందనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం మొదలు పెడుతున్నారు. దీనికి పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకొని జనవరి నుంచి యువశక్తి పేరుతో వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే సమయంలో బస్సు యాత్ర కూడా మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత చైతన్య రథంతో తన బస్సు యాత్రని శ్రీకాకుళం నుంచి ప్రారంభించి విజయవంతం అయ్యారు.

పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో శ్రీకాకుళం బస్సు యాత్రని మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా జనవరి 12న రణస్థలం యువశక్తి సభని నిర్వహించబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లు, ప్రోగ్రామ్ ప్లాన్ అంతా నాదెండ్ల మనోహర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఈ యువశక్తి, వారాహితో బస్సు యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్లి ఏ స్థాయిలో మైలేజ్ పెంచుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

3 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

3 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

1 day ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

1 day ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

1 day ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.