News: దేశ ముదురు సినిమాలో ఈ శరీరంలో ఏముంది అంటే మాట్టే కదా అని హీరోయిన్ ఓ డైలాగ్ చెబుతుంది. అది ముమ్మాటికి నిజమే. మానవ శరీర నిర్మాణం మట్టి, నీటితోనే మేగ్జిమమ్ నిండి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక గ్రంధాలలో కూడా ఆత్మకి చావులేదు. మరణం దేహానికి మాత్రమే అని మహర్షులు చెప్పారు. నిజమే మరణం ఈ దేహానికి మాత్రమే. మరణం తర్వాత ఈ శరీరంలో జీవాత్మ ఏం అవుతుందనేది ఎప్పటికి రహస్యమే. ఒక్కో మతం ఒక్కో విధంగా ఈ మానవ శరీరాన్ని వీడిన ప్రాణం ఉనికి గురించి చెప్పారు. ఎవరు ఎన్ని పంచభూతాల నిర్మితమైన ఈ శరీరాన్ని ఆత్మ వీడిన తర్వాత తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే కొన్ని మతాచారాలలో ఈ శరీరాన్ని దహనం చేస్తారు.
కొన్ని మతాలలో భూమిలోనే పాతేస్తారు. తరువాత శరీరంలో మట్టిలో పూర్తిగా కలిసిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత చూసుకుంటే తవ్విన చోట మనిషి ఎముకలు, అస్థిపంజరాలు మాత్రమే కనిపిస్తాయి. ఇతర శరీర అవయవాలు అన్ని మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయిన శరీరం సేంద్రీయ వ్యర్ధాలుగా మారిపోతుంది. అయితే ఈ సేంద్రీయ వ్యర్ధాలని ఎందుకు మళ్ళీ ఉపయోగించకూడదు అనే ప్రశ్న శాస్త్రవేత్తలకి వచ్చింది. జనాభా పెరిగిపోతున్న నేపధ్యంలో చనిపోతున్న మనుషులని పాతడానికి కూడా భూమిపై స్థలం ఉండటం లేదు.
బయోడిగ్రేడబుల్ పదార్ధాలని ఉపయోగించి వాటిని మృతదేహంపై వేసి 30 రోజుల పాటు భద్రపరుస్తారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి సహాయంతో శరీరంలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది శరీరం పూర్తిగా విచ్చిన్నం అవుతుంది. దానిని అత్యధిక టెంపరేచర్ వద్ద వేడి చేస్తారు. దీని ద్వారా అందులో ఉన్న హానికారక సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇలా తయారైన వ్యర్ధాలని మొక్కలకి కంపోస్ట్ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువులని పంటపొలాలకి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో మొక్కలకి ఉపయోగించాలని అనుకుంటే మాత్రం సిమ్మెట్రీ కార్పొరేషన్ అనుమతులు తీసుకోవాలి. ఇక ఈ హ్యూమన్ కంపోస్టింగ్ ఎరువుపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని దానిని తయారు చేస్తున్న సంస్థలు తెలుపుతున్నాయి. భవిష్యత్తులో మానవ శరీరాన్ని ఇలా ఉపయోగం లేకుండా ఖననం చేయకుండా హ్యూమన్ కంపోస్టింగ్ గా మార్చే ప్రక్రియ అన్ని దేశాలకి విస్తరించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.