Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ మూడ్ లోకి వచ్చేసారు. తన ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేందుకు ఫారెన్ కంట్రీస్ కి చెక్కేసారు. లేటెస్ట్ గా ఎయిర్ ఫోర్టులో ఫ్యామిలీ మొత్తం కనిపించడంతో ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్ కోసమే ఫ్యామిలీ మొత్తం కలిసి దుబాయ్ వెళుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి గిఫ్ట్ గా ఈ మూవీ విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఎప్పుడు ఎప్పుడు గుంటూరు కారం రిలీజ్ అవుతుందా అంటూ తన ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ మూవీ నుంచి రెండు పాటలను వదిలారు ఆ పాటలు రెండు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా మూవీపై పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ ప్రతి సంవత్సరం లాగే న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ ఏడు దుబాయ్ వెళుతున్నాడు. తన ఫ్యామిలీతో సహా ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. తాజాగా మహేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎయిర్ పోస్ట్ లో మహేష్ బాబు ఆయన కూతురు సితార హైలెట్గా నిలిచారు. సితార చేయి పట్టుకుని మహేష్ నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ నడిచారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మహేష్ ఫ్యామిలీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు న్యూయార్క్వెళ్తున్నట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం . దుబాయ్లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని. అక్కడే న్యూయర్ కి వెల్కమ్ చెబుతారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మహేష్ గుంటూరు కారం మూవీ సంక్రాంతి రోజు విడుదల అవుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించునున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు కారం టీం ఫ్యాన్స్ కు ఉర్రూతలూగించే అప్డేట్ ఇచ్చింది.’కుర్చి మడత పెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపేశారు.ఈ పాట ఫుల్ వెర్షన్ ను న్యూ ఇయర్ సందర్భంగా రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.