తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా బీజేపీ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం తెలంగాణలో లభించింది. ఈ అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీపై దూకుడు మంత్రం జపిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం బండి సంజయ్ టీం చేస్తుంది. అధికార పార్టీ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతూ కెసిఆర్ కి బలమైన ప్రత్యర్థి తామే అని బీజేపీ ప్రజలకు బలంగా రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లాంటి నాయకులు అందరూ కూడా దూకుడు మంత్రాన్ని జపిస్తున్నారు. ఈసారి తెలంగాణలో ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
మరో ఐదు ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని బీజేపీ తమ క్యాడర్ కి కూడా చెబుతూ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా రెగ్యులర్ గా తెలంగాణకి వస్తూ కెసిఆర్ దూకుడు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలలో దిట్ట అనే పేరు ఉన్న కేసీఆర్ మాత్రం బీజేపీని నిలువరించే ప్రయత్నం తెలంగాణలో చేయలేకపోతున్నారు అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీతో ఏకంగా కేంద్రంలో మోడీని ఎదుర్కోవాలని కేసీఆర్ వ్యూహాలు వేసుకుంటున్నారు.
తనది మోడీ స్థాయి అని భావిస్తూ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేటీఆర్ కి రాష్ట్ర బాధ్యతలని అప్పగించారు. అయితే దేశ రాజకీయాలలో ప్రస్తుతం మోడీ చరిష్మా నడుస్తుందని, వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీని ఎదుర్కోవడం కష్టం అనే మాట రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఎంతగా బీజేపీని మతతత్వ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్న అది ఇంకా ప్రజలలో బీజేపీకి పాజిటివ్ వోటింగ్ పెరగడానికి కారణం అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు ఇండియన్స్ అందరూ కూడా హిందుత్వ అజెండాతో భారత్ లో అలాగే చూడాలని అనుకుంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మధ్యలోనే బాంబ్ దాడులు జరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎవరికి అవకాశం ఇచ్చే స్థితిలో లేరనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక కేసీఆర్ మాత్రం తెలంగాణని వదిలేయడంతో ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ పాగా వేసే అవకాశం ఇచ్చిన వారు అవుతున్నారని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.