Categories: EducationLatestNews

Jio: జియో ల్యాప్ ట్యాప్ లు… అతి తక్కువ ధరల్లో మార్కెట్ లోకి

Jio: జియో ల్యాప్ ట్యాప్ లు… అతి తక్కువ ధరల్లో మార్కెట్ లోకి
దేశీయ టెలికాం, ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ జియో. దేశీయ మార్కెట్ ని జియో ప్రస్తుతం శాసిస్తుంది అని చెప్పాలి. రిలయన్స్ నుంచి జియో సిమ్ లతో మొదటిగా టెలికాం మార్కెట్ లోకి సరికొత్తగా వచ్చి ఉచిత ఆఫర్స్ తో అతి తక్కువ కాలంలో టెలికాం మార్కెట్ పై రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబాని ఆధిపత్యంలోకి వచ్చారు. అన్ని టెలికాం సేవలని దాటిపోయి దేశంలోనే అత్యధికంగా వినియోగించే సేవలుగా జియో మార్కెట్ లో నిలిచింది.

ఇక అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తన జియో మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నారు. జియో సిమ్ లతో కలిపి జియో ఫోన్స్ ని అతి తక్కువ ధరల్లో సామాన్యులకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్మార్ట్ ఫోన్ లో ఉన్న వీడియో, యూట్యూబ్ ఫీచర్స్ ని చిన్న సెల్ లోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫోన్ లు విపరీతంగా సేల్ అయ్యాయి. ఇక ఇప్పుడు టెలికాం రంగంలో సరికొత్త అధ్యయనంగా భావించే 5జీ సేవలని ఇండియాలో మొట్టమొదటిగా జియో స్టార్ట్ చేస్తుంది.

జియో5జీ సేవలని ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం స్టార్ట్ చేశారు. 2023 ఆఖరుకి 5జీ సేవలని దేశ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంగా జియో నెట్ వర్క్ పనిచేస్తుందని ముఖేష్ అంబానీ తాజాగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్ లని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ల్యాప్ టాప్ ఖరీదు ప్రస్తుతం 25 వేల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే జియో ల్యాప్ టాప్ లని కేవలం 15 వేల రూపాయిల ధరలలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇందులో జియో ఫీచర్స్ తో, పాటు ల్యాప్ టాప్ కి అవసరమయ్యే ప్రధాన ఫీచర్స్ ని ఇన్ బిల్ట్ గా ఇవ్వబోతున్నారు. ఇక ఈ ల్యాప్ టాప్ కోసం జియో సంస్థ ఇప్పటికే మైక్రో సాఫ్ట్ తో ఆపరేటింగ్ సిస్టమ్ కోసం, ప్రొసెసర్స్ కోసం క్వాల్ కమ్ తో ఒప్పందం చేసుకుంది. ఇక మైక్రో సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని మార్పులు చేసి జియో ఆపరేటింగ్ సిస్టంని, కొన్ని యాప్స్ ని లిమిటెడ్ గా ఇతర సాఫ్ట్ వేర్స్ ని ల్యాప్ టాప్ లో అందించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ల్యాప్ టాప్ లని వీలైనంత వేగంగా మార్కెట్ లోకి తీసుకొచ్చి అందరికి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలలో వినిపిస్తుంది. ఇక ల్యాప్ టాప్ లో ఇతర యాప్స్ కావాలన్నా జియో స్టోర్ కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని ఈ ల్యాప్ టాప్ లని డెవలప్ చేస్తున్నారని తెలుస్తుంది. భవిష్యత్ లో టెక్, టెలికాం రంగంలో తమ ఆధిపత్యం చూపించుకుని దిశగా ముఖేష్ అంబానీ ఇలా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

23 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

2 days ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

2 days ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

3 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

3 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

4 days ago

This website uses cookies.