Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా తన విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటంలో రహదారి విస్తరణ కారణంగా ఇళ్ళు ద్వంసం అయిన బాధితులకి లక్ష రూపాయిల పరిహారం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటం ప్రజలు చూపించినంత తెగువ అమరావతి రైతులలో ఉండి ఉంటే వైసీపీ రాజధానిని కదిలించే ధైర్యం చేసేది కాదని అన్నారు. విద్వంసమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, ప్రజల ఇళ్ళు కూలగొట్టి వారి ఉసురు పోసుకున్న ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని అన్నారు. తమని ముఖ్యమంత్రి జగన్ రౌడీ సేన అంటున్నారని, అయితే తమది విప్లవ సేన అని, రౌడీలసేన కాదని కౌంటర్ ఇచ్చారు. రౌడీలు ఉన్న పార్టీ వైసీపీ అనిఅన్నారు .
వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీగా ఆ పార్టకి ఉగ్రవాద సలహాలు ఇచ్చే వ్యక్తిగా సజ్జల ఉన్నారని విమర్శించారు. ప్రకృతి వనరుని దోచుకోవడం విధ్వంసం చేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని అన్నారు. ప్రకృతి వనరులని నాశనం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది గరుడపురాణం చదివితే తెలుస్తుందని అన్నారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఏంటో చూపిస్తా అని, అలాగే అభివృద్ధి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తానని అన్నారు. అయితే ప్రజలు తనని గెలిపించిన, గెలిపించకున్నా తన ప్రాణం ఉన్నంత వరకు వారికి తాను అండగా నిలబడతానని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు.
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద…
AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం.…
Bandi Bhagirath Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు…
This website uses cookies.