Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా తన విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటంలో రహదారి విస్తరణ కారణంగా ఇళ్ళు ద్వంసం అయిన బాధితులకి లక్ష రూపాయిల పరిహారం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటం ప్రజలు చూపించినంత తెగువ అమరావతి రైతులలో ఉండి ఉంటే వైసీపీ రాజధానిని కదిలించే ధైర్యం చేసేది కాదని అన్నారు. విద్వంసమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, ప్రజల ఇళ్ళు కూలగొట్టి వారి ఉసురు పోసుకున్న ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని అన్నారు. తమని ముఖ్యమంత్రి జగన్ రౌడీ సేన అంటున్నారని, అయితే తమది విప్లవ సేన అని, రౌడీలసేన కాదని కౌంటర్ ఇచ్చారు. రౌడీలు ఉన్న పార్టీ వైసీపీ అనిఅన్నారు .
వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీగా ఆ పార్టకి ఉగ్రవాద సలహాలు ఇచ్చే వ్యక్తిగా సజ్జల ఉన్నారని విమర్శించారు. ప్రకృతి వనరుని దోచుకోవడం విధ్వంసం చేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని అన్నారు. ప్రకృతి వనరులని నాశనం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది గరుడపురాణం చదివితే తెలుస్తుందని అన్నారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఏంటో చూపిస్తా అని, అలాగే అభివృద్ధి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తానని అన్నారు. అయితే ప్రజలు తనని గెలిపించిన, గెలిపించకున్నా తన ప్రాణం ఉన్నంత వరకు వారికి తాను అండగా నిలబడతానని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.