Technology: ఇంజనీరింగ్ చదువులు పూర్తిచేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో సెటిలై ఐదు అంకెల జీతాన్ని తీసుకోవాలని యువత కలలు కంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వారు కెరియర్ ప్లానింగ్ చేసుకొని సాఫ్ట్వేర్ కోర్సులను పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు సాధిస్తూ ఉంటారు. అయితే ఈ ఐటీ రంగంలో ఉద్యోగాలు అనేవి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అనే విధంగా తయారయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ఆర్థిక మాంధ్యం కారణంగా ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి. స్టార్ట్ అప్ కంపెనీల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అన్నీ కూడా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా అవసరానికి మించి ఉన్న ఉద్యోగులకు మంగళం పడేస్తున్నాయి.
ట్విట్టర్లో మొదలైన ఈ ఉద్యోగులు తొలగింపు క్రమంగా అన్ని ఐటీ కంపెనీలకు పాకుతున్నాయి. ఐటీ రంగం తో పాటు ఈ కామర్స్ వ్యాపారంలో ఉన్న జొమాటో, అమెజాన్, స్విగ్గి, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా స్విగ్గిలో 380 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం జరిగింది. ఇక సెర్చ్ ఇంజన్ టెక్నాలజీ కంపెనీ ఆయన గూగుల్ కూడా తాజాగా 12,500 మంది ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా తొలగించడం సంచలనంగా మారింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొలగించిన ఉద్యోగులందరికీ కూడా మెయిల్స్ ద్వారా క్షమాపణలు చెప్పి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 16 వారాల బోనస్, ఇంక్రిమెంట్, ఆరు నెలల హెల్త్ కేర్ బెన్ఫిట్ లు కల్పిస్తూ వాళ్లందర్నీ ఉద్యోగుల నుంచి తొలగించారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.