Politics: కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. బీజేపీలోకి వెళ్లిన కూడా తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అందుకుగాను గట్టిగానే క్యాంపైన్ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలిచి తీరాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బీజేపీ పుంజుకుంటుంది.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ప్రజలలో బీజేపీ బలం పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలలో గెలిచిన పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ తరుపున ఉప ఎన్నికలకి సిద్ధమయ్యారు. దీనిలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న కూడా అంతర్గత కుమ్ములాటల మధ్య అసలు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. ఇక ప్రజలు కూడా మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే అన్నట్లు చూస్తున్నారు. మరి అంతిమంగా ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదంటే అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమం మంత్రానికి ఓటు వేస్తారా అనేది చూడాలి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజల తీర్పు అప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…
This website uses cookies.