Politics: కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. బీజేపీలోకి వెళ్లిన కూడా తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అందుకుగాను గట్టిగానే క్యాంపైన్ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలిచి తీరాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బీజేపీ పుంజుకుంటుంది.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ప్రజలలో బీజేపీ బలం పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలలో గెలిచిన పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ తరుపున ఉప ఎన్నికలకి సిద్ధమయ్యారు. దీనిలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న కూడా అంతర్గత కుమ్ములాటల మధ్య అసలు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. ఇక ప్రజలు కూడా మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే అన్నట్లు చూస్తున్నారు. మరి అంతిమంగా ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదంటే అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమం మంత్రానికి ఓటు వేస్తారా అనేది చూడాలి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజల తీర్పు అప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.