Categories: LatestNews

Politics: మునుగోడులో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనేనా?

Politics: కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. బీజేపీలోకి వెళ్లిన కూడా తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అందుకుగాను గట్టిగానే క్యాంపైన్ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలిచి తీరాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బీజేపీ పుంజుకుంటుంది.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ప్రజలలో బీజేపీ బలం పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలలో గెలిచిన పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ తరుపున ఉప ఎన్నికలకి సిద్ధమయ్యారు. దీనిలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ కూడా ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సీటు కూడా బీజేపీ పార్టీకి వదిలేస్తే ప్రజలలోకి 2023 ఎన్నికలకి తప్పుడు సాంకేతం వెళ్తుందని భావిస్తుంది. ఈ నేపధ్యంలో కేటీఆర్ ఈ మునుగోడుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎలా అయినా గెలిచి తండ్రికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రచార సభలలో ప్రజలకి హామీ ఇస్తున్నారు. ఇక బీజేపీ కూడా కోమటిరెడ్డికి ఉన్న బలమైన ఓటుబ్యాంకుతో పాటు బీజేపీ ఫేమ్ ని ఉపయోగించుకొని గెలవాలని అనుకుంటుంది.

ఇక కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న కూడా అంతర్గత కుమ్ములాటల మధ్య అసలు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. ఇక ప్రజలు కూడా మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే అన్నట్లు చూస్తున్నారు. మరి అంతిమంగా ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదంటే అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమం మంత్రానికి ఓటు వేస్తారా అనేది చూడాలి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజల తీర్పు అప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

15 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

17 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.