Categories: LatestNews

Politics: మునుగోడులో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనేనా?

Politics: కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. బీజేపీలోకి వెళ్లిన కూడా తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అందుకుగాను గట్టిగానే క్యాంపైన్ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలిచి తీరాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బీజేపీ పుంజుకుంటుంది.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ప్రజలలో బీజేపీ బలం పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలలో గెలిచిన పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ తరుపున ఉప ఎన్నికలకి సిద్ధమయ్యారు. దీనిలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ కూడా ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సీటు కూడా బీజేపీ పార్టీకి వదిలేస్తే ప్రజలలోకి 2023 ఎన్నికలకి తప్పుడు సాంకేతం వెళ్తుందని భావిస్తుంది. ఈ నేపధ్యంలో కేటీఆర్ ఈ మునుగోడుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎలా అయినా గెలిచి తండ్రికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రచార సభలలో ప్రజలకి హామీ ఇస్తున్నారు. ఇక బీజేపీ కూడా కోమటిరెడ్డికి ఉన్న బలమైన ఓటుబ్యాంకుతో పాటు బీజేపీ ఫేమ్ ని ఉపయోగించుకొని గెలవాలని అనుకుంటుంది.

ఇక కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న కూడా అంతర్గత కుమ్ములాటల మధ్య అసలు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. ఇక ప్రజలు కూడా మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే అన్నట్లు చూస్తున్నారు. మరి అంతిమంగా ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదంటే అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమం మంత్రానికి ఓటు వేస్తారా అనేది చూడాలి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజల తీర్పు అప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.