Politics: ఏపీ రాజకీయాలలో వైసీపీ పార్టీతో చక్రం తిప్పుతూ ప్రభుత్వంలో ఉన్న వైఎస్ జగన్ తరహాలోనే తెలంగాణలో అన్నదారిలో వెళ్లి తాను కూడా ముఖ్యమంత్రి కావాలని వైఎస్ షర్మిల భావిస్తుంది. ఇందుకుగాను తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించి చురుకుగా తన రాజకీయ కార్యాచరణతో ముందుకి వెళ్తుంది. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా ప్రభావం చూపించే శక్తిగా ఎదగాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. దీనికిగాను తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో పాదయాత్రతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తాను కూడా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కావాలని షర్మిల భావిస్తుంది. ఏపీలో అన్న జగన్ కారణంగా ఎలాగూ తనకి అవకాశం లేదు కాబట్టి తెలంగాణని తన ముఖ్యమంత్రి కోరిక నెరవేర్చుకోవడానికి వేదికగా మార్చుకుంది. అందులో భాగంగానే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. వైఎస్ఆర్ ని అభిమానించే అందరూ తనతో పాటు తెలంగాణలో నడుస్తారని షర్మిల భావించారు.
అయితే అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాని, టీఆర్ఎస్ నుంచి కాని వైఎస్ఆర్ విధేయులుగా ఉన్న ఎవరూ కూడా షర్మిలతో నడవడం లేదు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో సెకండ్ కేటగిరీ లీడర్స్ గా ఉంటూ భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నవారు షర్మిల వెంట నడుస్తున్నారు. ఆమె పాదయాత్రకి కూడా తెలంగాణ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. తెలంగాణలో రాజకీయాలు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే తిరుగుతున్నాయి. అయితే షర్మిల కారణంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకుతో పాటు, వైఎస్ఆర్ ని అభిమానించే వారి ద్వారా గత రెండు ఎన్నికలలో టీఆర్ఎస్ కి పడ్డ ఓటు బ్యాంకు మొత్తం దూరం అవుతుందని బీజేపీ భావిస్తుంది. ఇది తమని అనుకూలించే అంశం అని వెనకుండి బీజేపీ షర్మిలని నడిపిస్తుంది అనే ప్రచారం ఉంది. టీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే రకమైన విమర్శలు చేస్తున్నారు.
కేవలం బీజేపీని ప్రభావాన్ని తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగానే టీఆర్ఎస్ వ్యూహాత్మకం గా షర్మిలని ఉపయోగించుకుంటుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. కవిత, షర్మిల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే టీఆర్ఎస్ ఫోకస్ అంతా ఇప్పుడు ఆమెని హైలైట్ చేయడం మీదనే ఉందనే టాక్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో షర్మిలని ఉపయోగించుకొని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ రాజకీయ వ్యూహాలు అమలు చేసుకుంటున్నాయి. మరి రానున్న ఎన్నికలలో ఆమె ప్రభావం ఏ పార్టీ మీద ఉంటుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.