Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ, ప్రధాని మోడీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ పార్టీ తనకి బలమైన ప్రత్యర్ధిగా మారుతుందని గ్రహించిన కేసీఆర్ తన వ్యూహాలకి తెరతీసారు. అందులో భాగంగా ఏకంగా మోడీపైనే విమర్శలు చేయడం ద్వారా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం కూడా చాలా కీలకం. అయితే బీజేపీతో కయ్యం పెట్టుకోవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన చాలా నిధులు ఆగిపోతాయని కూడా కేసీఆర్ కి తెలుసు. అయితే దీనినే మరోసారి ప్రజలలో తనపై నమ్మకం పెంచుకోవడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పార్టీ అడ్డం పడుతుందనే విమర్శలతో ప్రజలలో సెంటిమెంట్ ఎమోషన్ ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
మరో వైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయడానికి బీజేపీ వెనకనుండి పావులు కదుపుతుంది. బీజేపీ వ్యూహాలని ముందే పసిగట్టిన కేసీఆర్ వారికి దీటుగా తన ఆలోచనలకి పదును పెట్టి ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళు వ్యవహారంలో బీజేపీ పార్టీ నేతలని రెడ్ హ్యాండడ్ టీఎస్ పోలీసులతో పట్టుకున్నారు. ఇక ఆ వ్యవహారం మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా విజయాన్నిఅందించింది అనేది అందరూ ప్రత్యక్షంగా చూసారు. మరో వైపు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత పేరుని రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడం ద్వారా బీజేపీ పార్టీ కూడా తన రాజకీయ చతురతకి పదును పెట్టి టీఆర్ఎస్ పార్టీ మొత్తం స్కామ్ లు, అవినీతి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రచారం ఆర్బాటం కల్పిస్తూ తెలంగాణ ప్రజలలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత పెంచుతున్నారు.
ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పి ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నం మోడీ, అమిత్ షా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అండదండలు ఉంటే బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలలోకి వెళ్లి బీజేపీతో బలంగా పోరాడుతానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ తన రాజకీయ చతురతతో తెలంగాణ ప్రజలని ప్రాంతీయ సెంటిమెంట్ తో రెచ్చగొట్టి బీజేపీ పార్టీ నుంచి ఎదురుకాబోయే పోటీ నుంచి బయటపడి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.