Indrani Mukerjea : ఓటీటీల్లో డాక్యుమెంటరీ సిరీస్లకు భారీ ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు వీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో కొత్త కొత్త సిరీస్ లు ఓటీటీల్లో వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. అందులోనూ రియల్ స్టోరీస్, సెన్సేషనల్ కేసులను బేస్ చేసుకుని రిలీజ్ అయిన క్రైమ్ వెబ్ సిరీస్ల ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ ‘ది జాలీ జోసెఫ్ కేస్’ వంటి సిరీస్ లకు ఓటీటీలో వచ్చిన క్రేజ్ అందరికి తెలిసిందే. ఇప్పుడిదే జాబితాలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ వచ్చి చేరింది. ఈ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డులను సృష్టిస్తోంది.
ఇండియాలో 2015లో జరిగిన షీనా బోరా హత్య కేసు పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇటీవల ప్రముఖ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. నిజానికి కోర్టులో కేసుల వల్ల రిలీజ్ ఆలస్యమైనా ఎట్టకేలకు ఫిబ్రవరి 29వ స్ట్రీమ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ తదితర భాషల్లోనూ ఈ క్రైమ్ స్టోరీ స్ట్రీమింగ్ జరుగుతోంది . యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ సిరీస్ కేవలం భారత్ లోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా తో సహా 18 దేశాల్లో ట్రెండింగ్ లో ఉంది. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్లో టాప్-7లో నిలిచి రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం వారంలోనే 2.2 మిలియన్లపైగా వ్యూస్ ఈ సిరీస్ కు వచ్చాయి. అదేవిధంగా 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది.
మొత్తానికి ది ఇంద్రాణి ముఖర్జీయా డాక్యుమెంటరీ సిరీస్ అంచనాలకు మించి ఓటీటీలో దూసుకెల్తోంది . షీనా బోరా డెత్ కేసులో ట్విస్టులు ఉండడం, అందుకు తగ్గట్టుగానే క్రైమ్ సిరీస్ డైరెక్ట్ చేయడంతో దీనికి భారీ వ్యూస్ వస్తున్నాయి. ఉరార్, షానా లెవీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్లు ఉంది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగానే ఉంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.