Spirtual: సనాతన హిందూ ధర్మ సంబంధ ఎన్నో ఆచారాల్ని ఇప్పటికి కూడా నిత్య జీవితంలో చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం సమస్త జీవకోటిలో దైవం ఉంటుందని ఆ మతాన్ని ఆచరించేవారు విశ్వసిస్తూ ఉంటారు. అందులో చెట్టుకి, పుట్టకి, కనిపించే రాయికి కూడా బొట్టులు పెట్టి దండం పెట్టి మొక్కుతారు. అయితే కొంత మంది దీనికి మూఢత్వం అని అంటారు. మరికొంత మంది అసలు వాటిలో కూడా హిందువులు దైవాన్ని ఎలా చూడగలుగుతున్నారు అని విమర్శలు చేస్తూ ఉంటారు.
అయితే ఈ ప్రపంచంలో ప్రకృతి సిద్ధంగా లభించిన ప్రతిదీ మన జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. మన అవసరాలని తీరుస్తుంది. ఈ కారణంగానే వాటికి దైవత్వాన్ని ఆపాదించి హిందువులు వాటిని పూజిస్తారు. అలాగే పంచ భూతాలైన గాలి, నీరు, నిప్పు, మట్టి, ఆకాశం ని కూడా దైవం గా హిందువులు భావిస్తారు. ఈ కారణంగానే ఏ మతంలో లేనన్ని విశ్వాసాలు, ఆచారాలు, నమ్మకాలు హిందూమతంలో కనిపిస్తాయి. అందులో ఒకటి గృహ ప్రవేశం సమయంలో గోవుని ఇంట్లోకి తీసుకురావడం కూడా ఒకటి.
దీనిని ఇప్పటికి కూడా కొత్త ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు ఆచరిస్తారు. అయితే ఆ ఆచారం వెనుక బలమైన నమ్మకం ఉంది. హిందువులు ఎంత మంది అయితే దేవుళ్ళని పూజిస్తారో అంత మంది గోవులో కొలువై ఉంటారని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. సకల దేవతలకి ఆవాసం కలిగించినందుకు గోవుని గోమాత అని కూడా భావించి హిందువులు పూజిస్తారు. గోవుని కొత్త ఇంట్లోకి తీసుకొస్తే సకల దేవతలని గృహంలోకి ఆహ్వానించినట్లు అవుతుందని బలంగా నమ్ముతారు. ఈ కారణంగా కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం చేసినపుడు గోమాతని కచ్చితంగా ఇంట్లోకి తీసుకొచ్చి గోమూత్రం వేసిన, గోపేడ వేసిన దానిని ఎంతో అదృష్టంగా భావిస్తారు.
అయితే ప్రస్తుతం సిటీలకి చాలా మంది వెళ్ళిపోయి అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డారు. అయితే అలాంటి సమయంలో కూడా అపార్ట్మెంట్ పరిసరాల్లోకి గోవుని తీసుకొచ్చి పూజ చేయడం ద్వారా ఇంట్లోకి తీసుకొచ్చిన ఫలితం కలుగుతుందని చెబుతూ ఉంటారు. హిందువులు గోమాతని పూజించడం, గోమాతని గృహప్రవేశంలో ఇంట్లో అడుగుపెట్టించడం వెనుక ఇంత కథ ఉందని ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.