Categories: Health

Amnesia : మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయాల్సిందే?

Amnesia: ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న వస్తువులు ఎక్కడపడితే అక్కడ పెట్టేసి మరిచిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అలా ఎంత వెతికినా కూడా కొన్ని వస్తువులు అసలు కనపడవు. ఇలా ఈ మతిమరుపు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మామూలుగా మతిమరుపు సమస్య అన్నది వయసు మీద పడిన వారిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం చిన్న వయసు వారు కూడా మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునేవాళ్లకు పరీక్షల్లో సమాధానాలు గుర్తుకు రాక మార్కులు తక్కువ వస్తుంటాయి.

ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు. దీనికి ఏకైక పరిష్కారం మెదడుకు మేత పెట్టడమే. అది రోజువారీ చేయాల్సిన ఎక్సర్ సైజ్. ప్రతి పనిలోనూ దీన్ని ఆచరణలో పెట్టాలి. మీరు కూడా అలా మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే బుర్రకు పని చెప్పకుండా టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు. కనీసం పది మంది నంబర్లనైనా సొంతగా గుర్తు పెట్టుకోవట్లేదు. అంటే మైండ్ ని పట్టించుకోవట్లేదు. బ్లాంక్ గా ఉంచుతున్నారు. లెక్కలు చేయాలంటే క్యాలికులేటర్ వాడుతున్నారు. చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా అర్థాలను డిక్షనరీలో చూస్తున్నారు. చదవటం, రాయటం, గుర్తు పెట్టుకోవటం వంటివాటిని ఎప్పుడో మర్చిపోయారు.

రోజు రోజుకీ వస్తువుల మీద ఆధారపడటం పెరుగుతోంది. అలా బ్రెయిన్ వాడకం పూర్తిగా తగ్గిపోయింది. యంత్రాల సాయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల మనుషుల జీవితం కూడా యాంత్రికంగా మారిపోతోంది. మతి మరుపునకు 90 శాతం ఇదే కారణమని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెదడుకి పని చెప్పటమే కరెక్ట్ అని సూచిస్తున్నారు. డైలీ న్యూస్ పేపర్స్, మంచి మంచి బుక్స్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ మొబైల్ లో యూట్యూబ్ వీడియోలే చూస్తుంటే మైండ్ యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. పిల్లలు స్కూల్లో, కాలేజీల్లో ఇచ్చిన హోం వర్క్ చేసినట్లుగా పెద్దలు కూడా సెల్ఫ్ హోం వర్క్ చేసుకోవాలి. బుర్ర ఉపయోగించే చెస్ వంటి ఆటలాడాలి. అలాగే సమయం దొరికినప్పుడల్లా ఏదైనా లైబ్రరీకి వెళ్లడం ఇలాంటివి చేయాలి.

ఒంటరిగా ఉండకూడదు. దిగాలుగా కూర్చోకూడదు. ఎప్పుడూ నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. వివిధ అంశాలపైన ఎదుటివాళ్లతో చర్చించాలి. కొత్త విషయాలను తెలుసుకోవటం పైన ఫోకస్ పెట్టాలి. టీవీ చూడటం తగ్గించాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఏకాగ్రతను పెంచుకోవాలి. . టీవీ చూడడం మంచిదే కానీ ఏవైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే టీవీని చూడడం మంచిది. విద్యార్థులు చదువుకున్న టాపిక్ లను ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవాలి దీంతో అవి మెదడులో ఉండిపోతాయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఠక్కున గుర్తుకొస్తాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి గాడ్జెట్లను అవసరమైనప్పుడే వాడాలి. అతి అనేది ఎక్కడా పనికిరాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే మతి మరుపును శాశ్వతంగా మర్చిపోతారు.

Sravani

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.