Categories: Health

Amnesia : మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయాల్సిందే?

Amnesia: ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న వస్తువులు ఎక్కడపడితే అక్కడ పెట్టేసి మరిచిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అలా ఎంత వెతికినా కూడా కొన్ని వస్తువులు అసలు కనపడవు. ఇలా ఈ మతిమరుపు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మామూలుగా మతిమరుపు సమస్య అన్నది వయసు మీద పడిన వారిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం చిన్న వయసు వారు కూడా మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునేవాళ్లకు పరీక్షల్లో సమాధానాలు గుర్తుకు రాక మార్కులు తక్కువ వస్తుంటాయి.

ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు. దీనికి ఏకైక పరిష్కారం మెదడుకు మేత పెట్టడమే. అది రోజువారీ చేయాల్సిన ఎక్సర్ సైజ్. ప్రతి పనిలోనూ దీన్ని ఆచరణలో పెట్టాలి. మీరు కూడా అలా మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే బుర్రకు పని చెప్పకుండా టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు. కనీసం పది మంది నంబర్లనైనా సొంతగా గుర్తు పెట్టుకోవట్లేదు. అంటే మైండ్ ని పట్టించుకోవట్లేదు. బ్లాంక్ గా ఉంచుతున్నారు. లెక్కలు చేయాలంటే క్యాలికులేటర్ వాడుతున్నారు. చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా అర్థాలను డిక్షనరీలో చూస్తున్నారు. చదవటం, రాయటం, గుర్తు పెట్టుకోవటం వంటివాటిని ఎప్పుడో మర్చిపోయారు.

రోజు రోజుకీ వస్తువుల మీద ఆధారపడటం పెరుగుతోంది. అలా బ్రెయిన్ వాడకం పూర్తిగా తగ్గిపోయింది. యంత్రాల సాయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల మనుషుల జీవితం కూడా యాంత్రికంగా మారిపోతోంది. మతి మరుపునకు 90 శాతం ఇదే కారణమని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెదడుకి పని చెప్పటమే కరెక్ట్ అని సూచిస్తున్నారు. డైలీ న్యూస్ పేపర్స్, మంచి మంచి బుక్స్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ మొబైల్ లో యూట్యూబ్ వీడియోలే చూస్తుంటే మైండ్ యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. పిల్లలు స్కూల్లో, కాలేజీల్లో ఇచ్చిన హోం వర్క్ చేసినట్లుగా పెద్దలు కూడా సెల్ఫ్ హోం వర్క్ చేసుకోవాలి. బుర్ర ఉపయోగించే చెస్ వంటి ఆటలాడాలి. అలాగే సమయం దొరికినప్పుడల్లా ఏదైనా లైబ్రరీకి వెళ్లడం ఇలాంటివి చేయాలి.

ఒంటరిగా ఉండకూడదు. దిగాలుగా కూర్చోకూడదు. ఎప్పుడూ నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. వివిధ అంశాలపైన ఎదుటివాళ్లతో చర్చించాలి. కొత్త విషయాలను తెలుసుకోవటం పైన ఫోకస్ పెట్టాలి. టీవీ చూడటం తగ్గించాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఏకాగ్రతను పెంచుకోవాలి. . టీవీ చూడడం మంచిదే కానీ ఏవైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే టీవీని చూడడం మంచిది. విద్యార్థులు చదువుకున్న టాపిక్ లను ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవాలి దీంతో అవి మెదడులో ఉండిపోతాయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఠక్కున గుర్తుకొస్తాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి గాడ్జెట్లను అవసరమైనప్పుడే వాడాలి. అతి అనేది ఎక్కడా పనికిరాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే మతి మరుపును శాశ్వతంగా మర్చిపోతారు.

Sravani

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

21 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

21 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.