Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తరచూ దాహం వేస్తుంది. వేసవికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో వీలైనంత ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవి కాలంలో కొన్ని సందర్భాలలో ఎంత నీరు తాగినా కూడా దాహం తీరదు. అటువంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ బారీన పడకుండా ఉండటానికి నీరు త్రాగటంతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీరు తాగినా కూడా తరచూ దాహం వేస్తుంటే నీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో పుచ్చకాయ, కీరదోస, దోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
అలాగే శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోవడం వలన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండవు అలాంటి సమయంలో నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహం అనిపిస్తుంది. అలాంటి సమయంలో రెండు మూడు పండ్లకు కొద్దిగా పింక్ సాల్ట్ అంటించి తీసుకుంటే మంచిది. ఇలా పండ్లతో పాటు పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ జత చేసి తీసుకుంటే దాహం తీరుతుంది. అలాగే వేసవికాలంలో శరీరానికి చల్లదనం అందించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీరు, ఇతర పండ్ల జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.