Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తరచూ దాహం వేస్తుంది. వేసవికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో వీలైనంత ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవి కాలంలో కొన్ని సందర్భాలలో ఎంత నీరు తాగినా కూడా దాహం తీరదు. అటువంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ బారీన పడకుండా ఉండటానికి నీరు త్రాగటంతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీరు తాగినా కూడా తరచూ దాహం వేస్తుంటే నీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో పుచ్చకాయ, కీరదోస, దోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
అలాగే శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోవడం వలన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండవు అలాంటి సమయంలో నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహం అనిపిస్తుంది. అలాంటి సమయంలో రెండు మూడు పండ్లకు కొద్దిగా పింక్ సాల్ట్ అంటించి తీసుకుంటే మంచిది. ఇలా పండ్లతో పాటు పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ జత చేసి తీసుకుంటే దాహం తీరుతుంది. అలాగే వేసవికాలంలో శరీరానికి చల్లదనం అందించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీరు, ఇతర పండ్ల జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి.…
AP POLITICS: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన అధినేత,…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ఊహించని రీతిలో ఒక పొలిటికల్ గూగ్లీ ఎదురైంది. సామాజిక…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి క్షేత్రస్థాయిలో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. మనం ఏ చిన్న…
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
This website uses cookies.