Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తరచూ దాహం వేస్తుంది. వేసవికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో వీలైనంత ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవి కాలంలో కొన్ని సందర్భాలలో ఎంత నీరు తాగినా కూడా దాహం తీరదు. అటువంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ బారీన పడకుండా ఉండటానికి నీరు త్రాగటంతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీరు తాగినా కూడా తరచూ దాహం వేస్తుంటే నీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో పుచ్చకాయ, కీరదోస, దోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
అలాగే శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోవడం వలన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండవు అలాంటి సమయంలో నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహం అనిపిస్తుంది. అలాంటి సమయంలో రెండు మూడు పండ్లకు కొద్దిగా పింక్ సాల్ట్ అంటించి తీసుకుంటే మంచిది. ఇలా పండ్లతో పాటు పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ జత చేసి తీసుకుంటే దాహం తీరుతుంది. అలాగే వేసవికాలంలో శరీరానికి చల్లదనం అందించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీరు, ఇతర పండ్ల జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్…
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
This website uses cookies.