Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తరచూ దాహం వేస్తుంది. వేసవికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో వీలైనంత ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవి కాలంలో కొన్ని సందర్భాలలో ఎంత నీరు తాగినా కూడా దాహం తీరదు. అటువంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ బారీన పడకుండా ఉండటానికి నీరు త్రాగటంతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీరు తాగినా కూడా తరచూ దాహం వేస్తుంటే నీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో పుచ్చకాయ, కీరదోస, దోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
అలాగే శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోవడం వలన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండవు అలాంటి సమయంలో నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహం అనిపిస్తుంది. అలాంటి సమయంలో రెండు మూడు పండ్లకు కొద్దిగా పింక్ సాల్ట్ అంటించి తీసుకుంటే మంచిది. ఇలా పండ్లతో పాటు పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ జత చేసి తీసుకుంటే దాహం తీరుతుంది. అలాగే వేసవికాలంలో శరీరానికి చల్లదనం అందించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీరు, ఇతర పండ్ల జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.