ఆంధ్రప్రదేశ్ లో గత నెల అనగా ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్ల ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆగిపోయిన ఆ టీవీ ఛానల్ ప్రసారాలను మళ్లీ పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రశంసిస్తూ న్యూస్ బ్రాడ్ కాస్ట్ ఫెడరేషన్ ప్రకటన చేసింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ ప్రకటన ఆధారంగా చూసుకుంటే.. ఏపీలో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది.
న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని బ్రాడ్ క్యాస్ట్ ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు. జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, సాక్షి టీవీ, ఎన్టీవీ సహా పలు న్యూస్ ఛానెల్ల ప్రసారాలు ఏపీలో బ్లాక్ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో వచ్చిన మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదు.
టెలివిజన్ వినియోగదారుల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నది అతిపెద్ద మార్కెట్. ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని అంచనా. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తా ఛానెళ్లు కనీసం 62 లక్షల బాక్స్ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంపై టీవీ9 పిటిషన్ దాఖలు చేస్తూ.. ఛానెల్స్ను డిస్కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉంది అని పిటిషన్ లో పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్తా చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.