Gayathri Jayanthi: మన హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్లాపక్ష ఏకాదశి రోజున గాయత్రీ దేవి జన్మదినం జరుపుకుంతారు. మన హిందూ సంప్రదాయంలో గాయత్రీ దేవి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున నియమనిష్టలతో గాయత్రీ దేవిని పూజించడం వల్ల వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ ఏడాది గాయత్రి దేవి వ్రతాన్ని ఎప్పుడు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం మే 31వ తేదీ బుధవారం గాయత్రి జయంతి జరుపుకుంటారు. అలాగే ఈ రోజున నిర్జల ఏకాదశి కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది గాయత్రి దేవి వ్రతం చేయటానికి మే 30 2023న మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుంచి పూజా సమయం మొదలవుతుంది.. మే 31వ తేదీ మధ్యాహ్నం 1:45 నిమిషములకు ముగుస్తుంది. అయితే గాయత్రి జయంతి రోజున గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి.
అంతేకాకుండా ఇలా గాయత్రి దేవి వ్రతాన్ని చేయటం వల్ల జీవితంలో మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. సనాతన సంప్రదాయం ప్రకారం గాయత్రీ అమ్మవారు 4 వేదాలకు మూలంగా ప్రజలు నమ్ముతారు. గాయత్రి అమ్మవారిని సరస్వతీ, లక్ష్మీ, కాళీ మాతకు చిహ్నంగా పరిగణిస్తారు. వేదాలు గాయత్రీ దేవి నుంచి ఉద్భవించాయని పండితులు చెబుతున్నారు. నేను జీవితంలో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు నియమనిష్టలతో గాయత్రీ దేవి మంత్రాన్ని జపిస్తూ పూజించటం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.