Gayathri Jayanthi: మన హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్లాపక్ష ఏకాదశి రోజున గాయత్రీ దేవి జన్మదినం జరుపుకుంతారు. మన హిందూ సంప్రదాయంలో గాయత్రీ దేవి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున నియమనిష్టలతో గాయత్రీ దేవిని పూజించడం వల్ల వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ ఏడాది గాయత్రి దేవి వ్రతాన్ని ఎప్పుడు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం మే 31వ తేదీ బుధవారం గాయత్రి జయంతి జరుపుకుంటారు. అలాగే ఈ రోజున నిర్జల ఏకాదశి కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది గాయత్రి దేవి వ్రతం చేయటానికి మే 30 2023న మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుంచి పూజా సమయం మొదలవుతుంది.. మే 31వ తేదీ మధ్యాహ్నం 1:45 నిమిషములకు ముగుస్తుంది. అయితే గాయత్రి జయంతి రోజున గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి.
అంతేకాకుండా ఇలా గాయత్రి దేవి వ్రతాన్ని చేయటం వల్ల జీవితంలో మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. సనాతన సంప్రదాయం ప్రకారం గాయత్రీ అమ్మవారు 4 వేదాలకు మూలంగా ప్రజలు నమ్ముతారు. గాయత్రి అమ్మవారిని సరస్వతీ, లక్ష్మీ, కాళీ మాతకు చిహ్నంగా పరిగణిస్తారు. వేదాలు గాయత్రీ దేవి నుంచి ఉద్భవించాయని పండితులు చెబుతున్నారు. నేను జీవితంలో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు నియమనిష్టలతో గాయత్రీ దేవి మంత్రాన్ని జపిస్తూ పూజించటం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు.
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…
This website uses cookies.