Ganesh Immersion : దేశంలో మరెక్కడా జరగని రీతిలో హైదరాబాదులో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. భాగ్యనగరంలో జరిగే శోభాయాత్ర కన్నుల పండుగగా ఉంటుంది. నిమజ్జనం సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే గప్ చుప్ అన్నట్లు ఇళ్ళకే పరిమితమవుతాయి. భారీ వినాయక విగ్రహాల ఊరేగింపు రహదారులకు కొత్త శోభను అందిస్తాయి.
ఇన్నాళ్లు వీధి వీధి నా పూజలు అందుకున్న భారీ గణపయ్యలు మండపాలను వీడి డీజే చప్పుళ్లతో ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనం అవుతాయి. ఈ ఉత్సవాలను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. వివిధ ఆకృతుల్లో ఉన్న గణపయ్యలను దర్శించుకుని తరించిపోతారు.
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా
వినాయక విగ్రహాల నిమజ్జనానికి హైదరాబాద్ రెడీ అయ్యింది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు అలెర్ట్ అయ్యారు నిమజ్జనానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇవాళ హైదరాబాద్ పోలీస్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై భేటీ అయ్యాయి. నాంపల్లిలో జరిగిన ఈ సమావేశం లో లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే వారికి పలు సూచనలు చేశారు.
“తెలంగాణ సర్కార్ గణేష్ నిమజ్జనానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది. భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రయాణ సౌకర్యాల దగ్గరి నుంచి భద్రత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
నిమజ్జనం వేళ పాటించాల్సిన రూల్స్ ఇవే :
• శోభయాత్రలో డీజే పాటలు కాకుండా భక్తి పాటలు ఉంటే బాగుంటుంది.
• ఊరేగింపుల్లో, రథంపై మద్యం బాటిళ్లు ఉంటున్నాయని సమాచారం.అలా ఉంటే చర్యలు తప్పవు.
• టస్కర్ వెహికల్ లో పరిమితికి మించి జనం ఉండకూడదు.
• మధ్యాహ్నం 12 గంటల వరకు సౌత్ జోన్ దాటి విగ్రహాల ఊరేగింపు సాగాలి.
• నాన్ వెజ్ స్టాల్స్, లిక్కర్ అమ్మకాలు నిషేధం.
• గణేష్ ఊరేగింపులో పేపర్ గన్స్, పేపర్ హార్న్స్ వాడొద్దు.
• అల్లరి మూకలను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాయి.
• రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.