YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరికీ స్వేచ్చగా మాట్లాడే హక్కు లేదనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. అలాగే పేరుకే మంత్రులు ఉన్నారు తప్ప వారి శాఖల గురించి చాలా మందికి తెలియదని, అసలు వారి శాఖలకి సంబందించిన చేపట్టాల్సిన రివ్యూలు కూడా చేరరనేది జగమెరిగిన సత్యం. మీడియా ముందుకి వచ్చినా ఇప్పటి చంద్రబాబు పాలనలో అలా జరిగింది, ఇలా జరిగింది అని విమర్శలు చేయడం తప్ప పెద్దగా తాము చేస్తున్న అభివృద్ధి గురించి మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ప్రతిపక్షాలు విధానపరమైన విమర్శలు చేస్తే వారిపై వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి చేయడమే వైసీపీ ప్రధాన అజెండాగా ఉంటుంది అనేది రాజకీయ వర్గాలలో పదే పదే వినిపించే మాట.
ఇదే వారిని ప్రజలకి దూరం చేస్తుంది అనే మాట కూడా బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన విధానాలు అన్ని కూడా నియంతృత్వ ధోరణిలో ఉంటాయని ఆ పార్టీ నుంచి బయటకి వచ్చిన నేతలు అందరూ కూడా చేసే విమర్శలు. ఎంత పెద్దవాళ్ళు అయిన కూడా జగన్ దగ్గరకి వెళ్ళినపుడు నిలబడి మాట్లాడాల్సిందే అని చెబుతున్నారు. అలాగే అతన్ని సార్ అని పిలవాలని హుకుం జారీ చేస్తాడని కూడా చెబుతున్నారు.
అలాగే అభివృద్ధి గురించి కంటే జగన్ భజన చేయడమే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చేయాలని, అతను వానపాముని చూపించి నాగుపాము అనమంటే అందరూ అమ్మో పడగ ఎంత పెద్దగా ఉందో అనే రకం అని తాజాగా మాజీ వైసీపీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ తో మొదటి నుంచి వెంట ఉన్న అతను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జగన్ వ్యవహార శైలిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
Curd: వర్షాకాలంలో ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతాయి కనుక చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ…
TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.…
Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా…
Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు…
Fat Lumps: సాధారణంగా చాలామంది మెడ, చెయ్యి కాలి భాగంపై గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల…
TTD Hundi Record: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరికలు…
This website uses cookies.