YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరికీ స్వేచ్చగా మాట్లాడే హక్కు లేదనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. అలాగే పేరుకే మంత్రులు ఉన్నారు తప్ప వారి శాఖల గురించి చాలా మందికి తెలియదని, అసలు వారి శాఖలకి సంబందించిన చేపట్టాల్సిన రివ్యూలు కూడా చేరరనేది జగమెరిగిన సత్యం. మీడియా ముందుకి వచ్చినా ఇప్పటి చంద్రబాబు పాలనలో అలా జరిగింది, ఇలా జరిగింది అని విమర్శలు చేయడం తప్ప పెద్దగా తాము చేస్తున్న అభివృద్ధి గురించి మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ప్రతిపక్షాలు విధానపరమైన విమర్శలు చేస్తే వారిపై వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి చేయడమే వైసీపీ ప్రధాన అజెండాగా ఉంటుంది అనేది రాజకీయ వర్గాలలో పదే పదే వినిపించే మాట.
ఇదే వారిని ప్రజలకి దూరం చేస్తుంది అనే మాట కూడా బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన విధానాలు అన్ని కూడా నియంతృత్వ ధోరణిలో ఉంటాయని ఆ పార్టీ నుంచి బయటకి వచ్చిన నేతలు అందరూ కూడా చేసే విమర్శలు. ఎంత పెద్దవాళ్ళు అయిన కూడా జగన్ దగ్గరకి వెళ్ళినపుడు నిలబడి మాట్లాడాల్సిందే అని చెబుతున్నారు. అలాగే అతన్ని సార్ అని పిలవాలని హుకుం జారీ చేస్తాడని కూడా చెబుతున్నారు.
అలాగే అభివృద్ధి గురించి కంటే జగన్ భజన చేయడమే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చేయాలని, అతను వానపాముని చూపించి నాగుపాము అనమంటే అందరూ అమ్మో పడగ ఎంత పెద్దగా ఉందో అనే రకం అని తాజాగా మాజీ వైసీపీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ తో మొదటి నుంచి వెంట ఉన్న అతను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జగన్ వ్యవహార శైలిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.