Categories: LatestNewsPolitics

AP Politics: వైసీపీని టెన్షన్ పెడుతున్న ఉద్యోగులు… ఉద్యమం దిశగా

AP Politics: ఏపీలో అధికార పార్టీ వైసిపి ఓవైపు వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవడానికి ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. తాము ప్రజలకు సంక్షేమ పథకాలతో ఇస్తున్న డబ్బులు మరలా తమకు ఓట్లు తీసుకువస్తాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బందులు పడుతుంది మాత్రం ఉద్యోగులని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇక గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇక ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం కూడా కష్టమయ్యే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది.

డేట్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై చాలా రోజులు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం జీతాలు పెంచుతారని ఆలోచన కూడా ఇప్పుడు వారికి లేదు. ఒకటో తేదీకి జీతాలు ఇస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. ఓ విధంగా చెప్పాలంటే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రభుత్వంపై జీతల విషయంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే అధికార పార్టీ మాత్రం ఉద్యోగుల ఆందోళన అస్సలు లెక్క చేయలేదని చెప్పాలి.

తాజాగా ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు మరోసారి ఏపీ ప్రభుత్వానికి మార్నింగ్ ఇచ్చారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెలలో సిపిఎస్ రద్దు కోసం నిర్వహించే ఉప్పెన ఉద్యమంలో ఉద్యోగులందరూ కూడా పాల్గొంటారని బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగులు వైసీపీ సర్కారుపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఓ వైపు వైసీపీ సర్కార్ ప్రజల్లోకి జగనన్నే మా భవిష్యత్తు అంటూ బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉండగా మరో వైపు ఉద్యోగులు మాత్రం మా జీతాలు మాకు ఇవ్వండి, సీపీఎస్ రద్దు చేయండి అంటూ ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వైసీపీకి ఉద్యోగుల ఆందోళన పెద్ద తలనొప్పి అని చెప్పాలి

Varalakshmi

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

7 hours ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

7 hours ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

This website uses cookies.