Amla Before Meals: ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు అలాగే మారిన ఆహారపు అలవాట్లు కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల జబ్బులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనదేశంలో డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి పదిమందిలో ఏడు మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు చక్కర స్థాయిలను నిలకడగా ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల సహజ పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ విధంగా సహజ పద్ధతులలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో ఉసిరికాయ చాలా వరకు దోహదపడుతుంది.విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఉసిరికాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. భోజనానికి ముందు పచ్చి ఉసిరికాయను తినడం అనే ఒక చిన్న అలవాటు వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.డయాబెటిస్ ఉన్నవారిలో భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా చక్కెర స్థాయిలు పెరగడం వల్ల క్లోమగ్రంధి పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలోనే భోజనానికి ముందు ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే భోజనానికి ముందు ఉసిరి తీసుకోవడం వల్ల ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ ప్రవాహాన్ని ఎదుర్కొని శరీర జీవక్రియను సిద్ధం చేస్తుంది. ఉసిరిలో ఉండే పాలీఫెనాల్స్ గ్లూకోజ్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. మధుమేహంతో బాధపడేవారు రోజుల్లో వివిధ రకాలుగా ఉసిరిని తినటం మంచిది. అలాగే చక్కెరలు లేకుండా ఉసిరి రసాన్ని కూడా తాగటం వల్ల చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసినప్పటికీ చాలా పరిమితంగానే తీసుకోవాలి ఇంకా డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు డాక్టర్ సలహా లేకుండా ఉసిరికాయలు వాడకూడదు. డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
Mosquito Bite: వర్షాకాలం మొదలవడంతో దోమలు కూడా అధికమవుతున్నాయి. ఇలా దోమలు అధికమైతే కనుక కచ్చితంగా మలేరియా, డెంగ్యూ వంటి…
Srivari Mudupu: భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాదిమంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ఎంతో భక్తి…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ అడ్వెంచర్ 'విశ్వంభర' కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలై…
Smart Phone: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు…
Tirumala Laddu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. మన భారతదేశంలో…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు ఉన్న వైబ్రేషన్స్ వేరు. రంగా మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. కోస్తా…
This website uses cookies.