Eating Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే. తరచూ పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా అందిస్తోంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పెరుగును అన్ని సందర్భాలలో అందరూ తినటం వల్ల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పెరుగును ఏ పదార్థాలతో తినకూడదు ఎలాంటి సమస్యలతో బాధపడేవారు తినకూడదు అనే విషయానికి వస్తే..
ఎవరైతే మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతుంటారు అలాంటి వారు పెరుగుకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇలాంటివారు పెరుగును తినడం వల్ల కడుపు ఉబ్బరం, రక్తస్రావం కలుగుతుందని వ్యాధులు చెబుతున్నారు. అలానే ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు ఉన్నవారు పెరుగును తినకూడదు. ప్రతిరోజు పెరుగును తినకుండా ఉండాలి. దీనికి బదులుగా మజ్జిగను తీసుకోవచ్చని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పెరుగును తీసుకోకుండా ఉండాలని చెబుతున్నారు.
మాంసంతో పెరుగు తినకూడదు.అలా చేయడం వల్ల శరీరంలో విషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాంసం తినే సమయంలో పెరుగు తినకూడదు. పండ్లతో పాటు పెరుగు తినకూడదు. పండ్లతో పెరుగు తీసుకోవడం వల్ల జీవక్రియ సమస్యలు, అలెర్జీకు దారి తీస్తుంది. ఇక పెరుగును ప్రతి రోజు కూడా తీసుకోకూడదని ఒకవేళ పెరుగును తినాలి అనుకునేవారు ప్రతిరోజు మధ్యాహ్నం తినడం మంచిది కానీ రాత్రి పడుకునే సమయంలో పెరుగు తినకపోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.