Flowers: సాధారణంగా మనం పూజ చేసే సమయంలో స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేస్తూ ఉంటాము ఈ విధంగా పూజ చేయటం వల్ల స్వామివారి ప్రసన్నలు అవుతారని భావిస్తుంటారు. అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో పువ్వులు ఎందుకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. స్వామివారికి పువ్వులు పెట్టడం వల్ల సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.
పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు కూడా మార్గం చూపిస్తాయి. పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ ఉంటుంది. అలాగే వాటి సువాసన పూజలో ఒక రకమైన సానుకూల దృక్పధాలను కలిగిస్తుంటాయి అందుకే పువ్వులను దేవుడికి పెట్టడం వల్ల ప్రశాంతకరమైనటువంటి వాతావరణ ఏర్పడటమే కాకుండా మనకు కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయని భావిస్తారు.ధ్యానం, మంత్రోచ్ఛానులు తోడైతే పూజఫలం మరింత ఎక్కువ అవుతుంది.
ఇక స్వామివారికి మనం పెట్టే పుష్పాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలను స్వామి వారికి పెట్టకూడదు అలాగే వాసన చూసిన పుష్పాలను కింద రాలిపోయిన పుష్పాలను ఏరి స్వామివారికి పెట్టకూడదు ఇలాంటి పుష్పాలను పెట్టడం వల్ల మనం చేసే పూజకు ఫలితం ఉండదని పండితులు చెబుతుంటారు అందుకే స్వామివారికి తాజా చెట్టు మీద నుంచి కోసిన పుష్పాలను పెట్టడం ఎంతో మంచిది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.