Guava: జామకాయలు మన ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. తరచు జామకాయను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఏ, ఫైబర్ ,ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభించడంతోపాటు మన శరీరంలో ఇన్ఫెక్షన్ కలిగించే అనేక వ్యాధికారక సూక్ష్మజీవులను నశింపజేయడంలో ముఖ్యపాత్ర పోషించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
జామకాయను తినే విషయంలో కొందరికి కొన్ని ఆపోహాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి తెల్లని గుజ్జు గల జామపండు మంచిదా. ఎర్రని గుజ్జు గల జామపండు మంచిదా అనే సందేహాలు ఉన్నాయి. నిజానికి జామ పనులలో చాలా రకాలు ఉన్నప్పటికీ మనకు తెలుపు రంగు జామ పండ్లు, ఎరుపు రంగు జామ పండ్ల ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి రెండు రకాల జామపంలలోనూ ఒకే విధమైన ఔషధ గుణాలు పోషకపదార్థాలు లభిస్తాయి. వీటి మధ్య తేడా రంగు, రుచి , వాసన మాత్రమే అని చెప్పొచ్చు.
ఎరుపు రంగు జామ పండ్లలో కెరోటెనాయిడ్ అనే పదార్థం ఉంటుంది. అందువల్లే వీటిగుజ్జు పింకు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగు జామ పండు కంటే ఎరువు రంగు జామలో నీరు ఎక్కువగా ఉండి తీపి, గింజలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగానే ఉంటాయి. తెల్లని గుజ్జు గల జామలో నీటి శాతం తక్కువ తీపి, గింజలు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి ఎక్కువగానే ఉంటాయి.
జామ పండు ఏ రంగులో ఉన్న మన ఆరోగ్యాన్ని రక్షించడంలో మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది. తరచూ జామ పండ్లను తింటే ఒత్తిడి, నీరసం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధక సమస్య జరుగుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడి అతిబరువు సమస్యను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు మాత్రం తక్కువ తీపి, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఎరుగురంగు గుజ్జు జామ పండ్లను ఆహారంగా తీసుకోవడం మంచిది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.