Devotional Tips: మన హిందూ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ప్రజలు జ్యోతిష్య శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో మన రోజూ వారి జీవితంలో జరిగే మంచి చెడుల గురించి వివరించారు. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు జరగబోయే శుభాశుభాలకు ప్రతీకలుగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం లో వివరించబడింది.
మన జీవితంలో ప్రతి రోజూ జరిగే కొన్ని సంఘటనల వల్ల మంచి జరిగితే మరి కొన్ని సంఘటనల వల్ల చెడు జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మన చెయి జారీ కింద పడటం అశుభం జరుగుతుంది. ఎలాంటి వస్తువులు చేయి జారీ కింద పడితే అశుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఉప్పు కింద పడిపోవడం :
సాధారణంగా వంట చేసే సమయంలో అప్పుడప్పుడు ఉప్పు చేతి నుంచి జారి పడిపోతుంది. ఇలా ఉప్పు కింద పడటం చాలా అశుభం. ఇది జాతకంలో చంద్రుడు, శుక్రుడు ఏవింధంగా ఉందో తెలిపే సూచన. అంతేకాదు వైవాహిక జీవితంలో రాబోయే సమస్యలకు ప్రతీకగా కూడా భావించాలి. అంతే కాకుండా ఉప్పు లక్ష్మి దేవితో సమానం. ఉప్పు కింద పడితే ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి.
• కుంకుమ చేజారడం :
అలాగే పదేపదే కుంకుమ చేజారి కిందపడిపోవడం కూడా అశుభానికి సంకేతం. ఇలా జరగటం వల్ల భార్య, భర్తల దాంపత్య జీవితంలో గొడవలు జరిగి వారు , విడిపోతారని తెలిపే సూచన .
• ఆవ నూనె ఒలికిపోవడం :
జ్యోతిషం ప్రకారం ఆవనూనె ఒలికి పోవడం అపశకునం ఇలా జరిగిందంటే శని దృష్టి ప్రభావం పడి జీవితంలో సమస్యల ఎదురవుతాయని తెలిపే సూచిక. ఇలా జరిగినపుడు పరిహారంగా శని పూజ చేసుకొని శని దేవుడి అనుగ్రహం పొందాలి.
• పాలు ఒలికి పోవడం :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాల గిన్నే లేదా పాలు ఉన్న పాత్ర చేజారి కింద పడపోవడం అపశకునంగా పరిగణించాలి. జాతక చక్రంలో చంద్రుడి కదలికలు లేదా చంద్ర దశ సరిగా లేకపోతే ఇలాంటి అపశకునం జరుగుతుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.