Devotional Tips: మన హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతిరోజు దేవుని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటారు అందువల్ల శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే శుక్రవారం రోజున మహిళలు పొరపాటున చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంటికి దూరం అవుతుంది. అసలు శుక్రవారం రోజు మహిళలు ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం
శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున పూజ గది శుభ్రం చేసుకోవాలి. అయితే పూజగది శుభ్రం చేసిన తర్వాత ఆ చెత్తని బయటపడేయకూడదు. శుక్రవారం రోజున ఏ వస్తువు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళరాదు. శుక్రవారం రోజున చెత్త,పాత వస్తువులు బయట పడేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపరాదు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అయితే శుక్రవారం రోజున ఏవైనా వస్తువులు ఇంట్లోకి కొని తెచ్చుకోవటం మంచిది.
అలాగే శుక్రవారం రోజున పూజ చేయడానికి మహిళలు తలస్నానం చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున తలస్నానం అస్సలు చేయకూడదు. అలా చేస్తే సంపద హరించుకుపోతుంది. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా శుక్రవారం రోజున పొరపాటున కూడా కుంకుమ కింద పడకుండా చూసుకోవాలి. కుంకుమ కింద పడితే అరిష్టం. అలాగే ఆ రోజున దేవుడు ముందు పెట్టిన పూలు కూడా వాడిపోకుండా చూసుకోవాలి. అంతే కాకుండా మహిళలు ఇంట్లో ఏడవటం కూడా అరిష్టం. అందువల్ల మహిళలు పొరపాటున కూడా ఈ పనులు చేయరాదు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.