Devotional Tips: మన హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతిరోజు దేవుని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటారు అందువల్ల శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే శుక్రవారం రోజున మహిళలు పొరపాటున చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంటికి దూరం అవుతుంది. అసలు శుక్రవారం రోజు మహిళలు ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం
శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున పూజ గది శుభ్రం చేసుకోవాలి. అయితే పూజగది శుభ్రం చేసిన తర్వాత ఆ చెత్తని బయటపడేయకూడదు. శుక్రవారం రోజున ఏ వస్తువు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళరాదు. శుక్రవారం రోజున చెత్త,పాత వస్తువులు బయట పడేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపరాదు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అయితే శుక్రవారం రోజున ఏవైనా వస్తువులు ఇంట్లోకి కొని తెచ్చుకోవటం మంచిది.
అలాగే శుక్రవారం రోజున పూజ చేయడానికి మహిళలు తలస్నానం చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున తలస్నానం అస్సలు చేయకూడదు. అలా చేస్తే సంపద హరించుకుపోతుంది. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా శుక్రవారం రోజున పొరపాటున కూడా కుంకుమ కింద పడకుండా చూసుకోవాలి. కుంకుమ కింద పడితే అరిష్టం. అలాగే ఆ రోజున దేవుడు ముందు పెట్టిన పూలు కూడా వాడిపోకుండా చూసుకోవాలి. అంతే కాకుండా మహిళలు ఇంట్లో ఏడవటం కూడా అరిష్టం. అందువల్ల మహిళలు పొరపాటున కూడా ఈ పనులు చేయరాదు.
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
This website uses cookies.