Devotional Tips: సాధారణంగా హిందువులు వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెద్ద ఎత్తున పూజలు చేయడం గుడికి వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే చాలామంది గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దీపం వెలిగించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు అయితే గుడికి వెళ్లిన తర్వాత ముందుగా దీపం ఎక్కడ వెలిగించి పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక గుడి ప్రాంగణంలో వారికి అనువైన చోట దీపం వెలిగిస్తుంటారు. అయితే గుడికి వెళ్ళిన చోట ముందుగా దీపం ఎక్కడ వెలిగించాలి ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత దేవాలయానికి వెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే దేవాలయానికి వెళ్ళిన తర్వాత అందరూ గర్భగుడిలోకి వెళ్లి దేవుడి ముందు దీపం పెట్టి పూజిస్తారు. అయితే ఆలయానికి వెళ్ళిన తర్వాత మొదటగా గర్భగుడిలో దీపం పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. మన గుడికి వెళ్ళిన తర్వాత నేరుగా గర్భగుడికి వెళ్లి స్వామి వారిని పూజించకూడదు ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లి అక్కడ నమస్కరించి దీపం వెలిగించాలి.
ఈ విధంగా ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమంలో ఆలయంలో ఉన్న ఇతర దేవతలకు కూడా నమస్కరించి పూజ చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లాలి. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాత ఐదు తొమ్మిది ఇలా వారికి తోచినన్ని ప్రదక్షిణలు చేయవచ్చు.
ఇక ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లి అక్కడ దేవుడు ముందు దీపం వెలిగించి మనం తీసుకువెళ్లిన పండ్లు పూలు నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఇలా దేవుడిని నమస్కరించుకొని తిరిగి నేరుగా ఇంటికి వెళ్ళాలి.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.