Cloves: ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పదిమందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇంకొందరు దరిద్రం పట్టి పీడిస్తోంది అందుకే డబ్బులు చేతిలో మిగడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. కొందరు సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించదు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతుంటే లవంగాలతో ఇలా చేయాల్సిందే.
మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు కచ్చితంగా ఉంటాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా వారు ఇబ్బంది పెడుతుంటే అందుకు లవంగం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహుదోషం తొలగిపోతుంది. పరమ శివుడికి 40 రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దుష్ప్రభావాలన్నీ తొలగుతాయి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో రెండు లవంగాలు పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడం వల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది. అలాగే అమావాస్య రోజు లేదంటే పూర్ణిమ రోజు రాత్రిపూట కర్పూరంలో 21 లవంగాలను కాల్చి, లక్ష్మీదేవిని ధ్యానిస్తూ హవనం చేయాలి.
దీనివల్ల రాహు-కేతువుల దుష్పరిణామాలు తగ్గడంతో పాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి. ఐదు లవంగాలు, ఐదు కౌరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలగడంతో పాటు ధనధాన్యాలు లభిస్తాయి. లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో రెండు లవంగాలను కూడా వేసి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.