Cloves: ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పదిమందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇంకొందరు దరిద్రం పట్టి పీడిస్తోంది అందుకే డబ్బులు చేతిలో మిగడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. కొందరు సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించదు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతుంటే లవంగాలతో ఇలా చేయాల్సిందే.
మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు కచ్చితంగా ఉంటాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా వారు ఇబ్బంది పెడుతుంటే అందుకు లవంగం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహుదోషం తొలగిపోతుంది. పరమ శివుడికి 40 రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దుష్ప్రభావాలన్నీ తొలగుతాయి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో రెండు లవంగాలు పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడం వల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది. అలాగే అమావాస్య రోజు లేదంటే పూర్ణిమ రోజు రాత్రిపూట కర్పూరంలో 21 లవంగాలను కాల్చి, లక్ష్మీదేవిని ధ్యానిస్తూ హవనం చేయాలి.
దీనివల్ల రాహు-కేతువుల దుష్పరిణామాలు తగ్గడంతో పాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి. ఐదు లవంగాలు, ఐదు కౌరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలగడంతో పాటు ధనధాన్యాలు లభిస్తాయి. లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో రెండు లవంగాలను కూడా వేసి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.